టాలీవుడ్ లో ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్స్ సైతం ఈ మధ్యకాలంలో బాలీవుడ్ వైపు వెళ్లి బిజీగా కొనసాగుతున్నారు. ఇప్పటికే సౌత్ లో బాగా పాపులర్ అయిన నటులంతా కూడా బాలీవుడ్ వైపు పడుతున్న వారిలో నయనతార, సమంత, రకుల్, రష్మిక ,పూజా హెగ్డే ,తమన్నా తదితర నటీమణులు ఉన్నారు. అయితే బాలీవుడ్ లో ఎక్కువ సినిమాలలో నటిస్తున్న వారిలో కేవలం రకుల్ ప్రీతిసింగ్ మాత్రమే ముందు ఉంది. ఇప్పటికే ఈ అమ్మడు ఆరేడు సినిమాలలో నటించింది.
యారియన్ సినిమాతో బాలీవుడ్ లో తన కెరీర్ ని మొదలుపెట్టిన రకుల్ ప్రీతిసింగ్ ఆ తర్వాత టాలీవుడ్ లోకి వచ్చి సక్సెస్ అయ్యింది. ఇప్పుడు మళ్లీ బాలీవుడ్ లో వెళ్లి సక్సెస్ ఫ్లాప్ లకు సంబంధం లేకుండా సినిమాలలో నటిస్తోంది. మళ్లీ ఇదే స్థాయిలో ఆకట్టుకుంటున్న హీరోయిన్లలో రష్మిక కూడా ఒకరు. బాలీవుడ్ అభిరుచులకు తగ్గట్టుగా తనని తాను మార్చుకుంటూ ముందుకు వెళ్తోంది. మిషన్ మజ్ను సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఇప్పుడు యానిమల్ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాపై కూడా భారీగానే అంచనాలు ఉన్నాయి. భవిష్యత్తులో కూడా ఇక్కడే నటించబోయే విధంగా ప్లాన్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.
ప్రస్తుతం సమంత కూడా ఎక్కువగా బాలీవుడ్ వైపు తన ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. పలు వెబ్ సిరీస్ లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తోంది. తాజాగా సీటాడెల్ అనే ఇండియన్ వెబ్ సిరీస్లో నటించబోతోంది సమంత. అలాగే తాప్సి నిర్మాణంలో కూడా ఒక సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే కొంతమంది అగ్ర హీరోల సరసన కూడా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నయనతార కూడా జవాన్ సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ సినిమాతో నయనతార అక్కడ బిజీ హీరోయిన్గా మారిపోతుందని అభిమానులు భావిస్తున్నారు. ఇతర భాషలలో సక్సెస్ అయిన వీరు హిందీలో సక్సెస్ అవుతారని కూడా అభిమానులు తెలియజేస్తున్నారు. బాలీవుడ్లో అంత పోటీ ఉండి ఈ ముద్దుగుమ్మలు నిలబడి సత్తా చాటగలరేమో చూడాలి మరి.