మ‌హేష్ బాబు, న‌య‌న‌తార ఒక్క‌సారి కూడా ఎందుకు క‌లిసి న‌టించ‌లేదో తెలుసా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్‌ లో సౌత్ స్టార్ హీరోయిన్లందరితో కలిసి నటించాడు. కానీ ఇంతవరకు లేడీ సూపర్ స్టార్ నయనతారతో మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేదు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా చూడాలని అభిమానులు ఎంతగానో ముచ్చట పడ్డారు. కానీ అది ఇంతవరకు జరగలేదు. భవిష్యత్తులో కూడా వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుంది అన్న నమ్మకం కూడా పోయింది.

అయితే మహేష్, నయనతార కలిసి ఇంతవరకు ఎందుకు కలిసి నటించలేదు అన్న‌ సందేహం చాలా మందికి ఉంది. ఇందుకు ప్ర‌త్యేకించి కారణం లేకపోయినా.. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఏకంగా మూడు సినిమాలు మిస్ అయ్యాయి. ఈ లిస్టులో పోకిరి ఒకటి. పూరీ జగన్నాథ్ తెర‌కెక్కించిన ఈ సినిమాలో మొదట నయనతారను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఆమె డేట్స్ ఖాళీగా లేకపోవడంతో పోకిరిని రిజెక్ట్ చేసింది. దాంతో ఇలియానా హీరోయిన్ గా ఎంపికైంది.

ఆ తర్వాత అతిథి సినిమాలో కూడా హీరోయిన్ గా అనుకున్నారు. డైరెక్టర్ సురేందర్ రెడ్డి చెన్నైలో ఆమెకు కథ కూడా వినిపించాడు. కానీ కథ నయనతారను మెప్పించలేకపోవడంతో ఆమె ఈ ప్రాజెక్ట్ కు నో చెప్పింది. న‌య‌న్‌ ఊహించినట్లుగానే అతిథి ఫ్లాప్ అయింది. మహేష్ నటించిన సూపర్ హిట్ మూవీ దూకుడు లో నయనతారను హీరోయిన్ గా అనుకున్నారుజ‌ కానీ మహేష్ మాత్రం సమంతను సూచించారట. దాంతో శ్రీను వైట్లో కూడా సమంత వైపు మొగ్గు చూపారు. అలా మూడుసార్లు వీరిద్దరి కలయికలో సినిమాలు మిస్ అయ్యాయి.