బైక్ యాక్సిడెంట్ అనంతరం మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నుంచి వస్తున్న తొలి చిత్రం `విరూపాక్ష`. విలేజ్ బ్యాక్డ్రాప్ లో సాగే మర్రర్ థ్రిల్లర్ ఇది. ఈ మూవీ ద్వారా కార్తీక్ వర్మ దండు దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ప్రముఖ స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి కథ అందించగా.. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది.
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బాపినీడు.బి సమర్పణలో బీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 21 శుక్రవారం నాడు థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడటంతో.. విరూపాక్షకు భారీ బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్సీ రేట్లకు ఈ మూవీని కొనుగోలు చేశారు. నైజాం ప్రాంతంలో విరూపాక్ష థియేట్రికల్ హక్కులు రూ. 7 కోట్లకు అమ్ముడుపోయాయట.
అలాగే సీడెడ్ ప్రాంతంలో రూ. 3.7 కోట్లు, ఆంధ్ర ప్రాంతంలో రూ.8.5 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగింది. ఈ రకంగా తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు రూ.19 పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇక కర్ణాటక మరియు రెస్టాఫ్ ఇండియాలో రూ.1.50 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 1.50 కోట్లకు ఈ మూవీని కొనగోలు చేసింది. మొత్తంగా వరల్డ్ వైడ్ విరూపాక్ష బిజినెస్ రూ. 22.20 కోట్లు. అంటే ఈ సినిమాతో తేజ్ హిట్ కొట్టాలంటే బాక్సాఫీస్ వద్ద రూ. 23 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది.