క‌ళ్లు చెదిరే రీతిలో `గేమ్ ఛేంజ‌ర్‌` క్లైమాక్స్ సీన్‌.. 1200 మందితో యాక్షన్ సీక్వెన్స్!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకుంటున్న పొలిటిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `గేమ్ ఛేంజ‌ర్‌`. ఇందులో రామ్ చ‌ర‌ణ్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజ‌లి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

ఎస్ జె సూర్య, జయరామ్, సునీల్, శ్రీకాంత్, సముద్రఖని, న‌వీన్ చంద్ర‌ తదితరులు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. థ‌మ‌న్ స్వ‌రాలు అందిస్తున్నాడు. డైరెక్ట‌ర్ శంక‌ర్ ఓవైపు `గేమ్ ఛేంజ‌ర్‌`తో పాటు మ‌రోవైపు క‌మ‌ల్ హాస‌న్ `భార‌తీయుడు 2`ను కూడా పూర్తి చేస్తున్నారు. అయితే రామ్ చ‌ర‌ణ్ సినిమా షూటింగ్ ముగింపు ద‌శ‌కు చేరుకుంది.

త్వ‌ర‌లోనే సినిమాకు అత్యంత కీల‌క‌మైన క్లైమాక్స్ సీన్ ను చిత్రీక‌రించ‌బోతున్నాడు. అయితే ఈ క్లైమాక్స్ సీన్ క‌ళ్లు చెదిరే రీతిలో ఉండేలా శంక‌ర్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఇందులో భాగంగానే ఏకంగా 1200 మంది ఫైటర్లతోభారీ యాక్షన్ సీక్వెన్స్ తీయబోతున్నార‌ట‌. దీనికోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్ కూడా వేశారు. ఈ షూటింగ్ లో రామ్ చరణ్ తోపాటు విలన్ ఎస్‌జే సూర్య ఏప్రిల్ 23 నుంచి పాల్గొననున్నారు. ఈ క్లైమాక్స్ సీన్ పూర్తైతే దాదాపు 90 శాతం షూటింగ్ కంప్లీట్ అయిన‌ట్లే అని అంటున్నారు. కాగా, ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి లేదా స‌మ్మ‌ర్ కు విడుద‌ల కానుంది.