టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జోడీకి ఆన్ స్క్రీన్ పైన కాదు ఆఫ్ స్క్రీన్ లోనూ ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. `గీత గోవిందం` సినిమాలో వీరిద్దరూ తొలిసారి జంటగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అలాగే ఈ సినిమాలో విజయ్, రష్మిక కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఆ తర్వాత వీరిద్దరూ `డియర్ కామ్రేడ్` సినిమాలో నటించారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయితే గీతగోవిందం సినిమా సమయంలో ఏర్పడ్డ వీరి పరిచయం ప్రేమగా మారిందంటూ ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ పలు మార్లు జంటగా కనిపించడం, కలిసి వెకేషన్ కు వెళ్లడం వంటి అంశాలు నెట్టింట జరుగుతున్న ప్రచారానికి బలాన్ని చేకూర్చాయి.
అయితే అనూహ్యంగా వీరిద్దరూ విడిపోయారంటూ రెండు రోజుల నుంచి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఏమైందో ఏమో ఇద్దరి ప్రేమకు బ్రేకప్ పడినట్లు ప్రచారం జరుగుతోంది. గత కొద్ది రోజుల నుంచి రష్మికకు విజయ్ దూరంగా ఉంటున్నట్లు చెబుతోన్నారు. అయితే ఇది నిజమే అన్న సందేమాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే, నిన్న రష్మిక బర్త్డే. ఆమెకు అభిమానులతో పాటు సన్నిహితులు, తోటి సినీ తారలు సోషల్ మీడియా ద్వారా విషెస్ చెప్పారు. కానీ, విజయ్ దేవరకొండ మాత్రం రష్మిక బర్త్డే విషెస్ చెబుతూ కనీసం ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. దీంతో వీరిద్దరూ నిజంగా విడిపోయినట్లు ఉన్నారని చర్చించుకుంటున్నారు. మరికొందరేమో ఫోన్ చేసి విష్ చేసి ఉండొచ్చు కదా అని అభిప్రాయపడుతున్నారు.