లేడీ సూపర్ స్టార్ నయనతార గత ఏడాది పెళ్లి పీటలెక్కిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ దర్శకనిర్మాత విఘ్నేష్ శివన్ తో దాదాపు ఏడేళ్ల పాటు డేటింగ్ చేసిన నయనతార.. ఫైనల్గా అతడితో ఏడడుగులు వేసింది. పెళ్లి అయిన నాలుగు నెలలకే సరోగసి ద్వారా ఈ దంపతులు ఇద్దరు కవల మగ పిల్లలకు జన్మనిచ్చారు.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విఘ్నేష్.. నయన్ తో తన లవ్ స్టోరీని రివీల్ చేశాడు. `నేనూ రౌడీనే` షూటింగ్ సమయంలోనే విఘ్నేష్, నయన్ మధ్య ప్రేమ చిగురించిందని అంతా అనుకున్నారు. కానీ, అంతకంటే ముందే నయనతార ప్రేమలో పడ్డాడు విఘ్నేష్. `పోడాపోడీ చిత్రం పరాజయంతో నన్ను నేను నిరూపించుకోలనుకున్నా. అప్పుడే నేనూ రౌడీనే అనే చిత్ర కథ రాశా. నా దగ్గర ఓ కథ ఉందని తెలుసుకున్న హీరో ధనుష్..దానిని ప్రొడ్యూస్ చేయడానికి రెడీ అయ్యారు.
నయనతార పర్ఫెక్ట్ అని సూచించి.. ఆమెకు కథ చెప్పమన్నారు. కానీ నయనతార ఈ చిత్రానికి ఒకే చెబుతందని అనుకోలేదు. ఆమె నో అంటే నజ్రియాకి కథ చెప్పాలనుకున్నా. కానీ, నయన్ నేనూ రౌడీకి గ్రీన్ ఇచ్చింది. అప్పుడే ఆమె ప్రేమలో పడ్డాను. షూటింగ్ సెట్స్ లో కొన్ని రోజుల పాటు నయన్ ని మేడం మేడం అంటూ పిలిచేవాడిని. ఆమె క్యారవ్యాన్ లోకి వెళ్లాలన్నా భయపడేవానిని. కానీ కొన్ని రోజుల తర్వాత ఆమె కూడా నన్ను ఇష్టపడటం ప్రారంభించింది. దాంతో డేటింగ్ మొదలు పెట్టాం. ఫైనల్గా గత ఏడాది పెళ్లి చేసుకున్నాము.` అని విఘ్నేష్ తెలిపాడు. మొత్తానికి మేడం మేడం అంటూనే నయన్ ను విఘ్నేష్ ముగ్గులోకి దింపాడు.