ట్రైలర్: అదరగొట్టేస్తున్న వీరుపాక్ష ట్రైలర్..!!

సుప్రీం హీరో సాయి ధరంతేజ్ నటిస్తున్న తాజా చిత్రం విరూపాక్ష.. ఈ చిత్రం ఈనెల 21వ తేదీన పాన్ ఇండియా మూవీగా విడుదల కాబోతోంది.. ఇందులో హీరోయిన్గా సంయుక్తమైన నటిస్తోంది. సాయి ధరమ్ తేజ్ కెరియర్ లోనే మొట్ట మొదటిసారిగా పాన్ ఇండియా సినిమా ఇదే అని చెప్పవచ్చు.. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ పోస్టర్లు ఈ సినిమా పైన మంచి బజ్ ని క్రియేట్ చేశాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా ట్రైలర్ విడుదలవుతుందా అంటూ సాయి ధరంతేజ్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.. అయితే ఎట్టకేలకు ఈ సినిమా ట్రైలర్ విడుదల అవ్వడం జరిగింది.

Virupaksha trailer launch: Dil Raju, Allu Aravind are the chief guests -  Telangana Today

ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ముఖ్య అతిధులుగా అల్లు అరవింద్, దిల్ రాజు హాజరు కావడం జరిగింది.ఈ ట్రైలర్ విషయానికి వస్తే..2.5 నిమిషాల రన్ టైంలో ఉన్న ఈ ట్రైలర్ రుద్రవరం అనే ఊరు ఆ ఊరిలో వరస మరణాలు దాని వెనక ఉన్న కథ ఏంటి అనే సినిమా కథ అంశముగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఓవరాల్ గా విజువల్ ఎఫెక్ట్తో ట్రైలర్ బాగా హైలైట్ గా నిలుస్తోంది. ఈ చిత్రానికి సుకుమార్ స్క్రీన్ ప్లే అందించడంతో పాటు కార్తీక్ దండు దర్శకత్వం వహించారు.

ఇందులో కీలకమైన పాత్రలు సునీల్, అజయ్, బ్రహ్మాజీ నటిస్తున్నట్లు తెలుస్తోంది. సాయి ధరంతేజ్ కెరియర్ లోని ఈ సినిమా ఒక విభిన్నమైన చిత్రంగా ఉండబోతోంది. పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి మరి. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ తెగ వైరల్ గా మారుతోంది.