బాక్సాఫీస్‌ని దున్నేస్తున్న టాలీవుడ్.. 100 క్రోర్ క్లబ్‌లో చేరిన 4 సినిమాలు..

2023లో టాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద దుమ్ము లేపుతున్నాయి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా తెలుగు సినిమాలు బాక్సాఫీస్‌ ని కలెక్షన్లతో నింపేస్తున్నాయి. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి రూ.236 కోట్లు కలెక్ట్ చేసింది. చాలా కాలం తరువాత మెగాస్టార్ చిరంజీవి ఇరగదీసిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రలోనే కాకుండా యూఏస్ లో కూడా మంచి కలెక్షన్లు వసూలు చేసింది.

ఇక నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన వీర సింహ రెడ్డి సినిమా బాక్సఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిందనే చెప్పాలి. సంక్రాంతి పండుగ సీజన్‌లో వచ్చిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.134 కోట్లు వసూలు చేసింది. బాలయ్య నటించిన అఖండ సినిమా రికార్డులను వీర సింహరెడ్డి బ్రేక్ చేసింది. ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో ప్రేక్షకులను అలరించారు.

తమిళ్ హీరో ధనుష్ నటించిన సార్ సినిమా కూడా మంచి టాక్ సంపాదించుకుంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషలలో విడుదలై మంచి విజయం అందుకుంది. ఈ సినిమాలో ధనుష్ కి జంటగా సంయుక్త నటించారు. సార్ సినిమా రెండు భాషలలో కలిపి రూ.121 కోట్లు కలెక్ట్ చేసింది.

 

నేచరల్ స్టార్ నాని నటించిన దసరా సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుంది. శ్రీకాంత్ ఒదెలా దర్శకత్వం వహించిన దసరా సినిమా నైజం, ఓవరీస్ ఏరియాలో చెలరేగిపోతుంది. కానీ మిగితా చోట్ల ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. హిందీ, మలయాళం, తమిళ భాషలో అయితే మినిమమ్ వసూలు కూడా రాబట్టలేదు. ఫస్ట్ వీక్ ముగిసేసరికి దసరా రూ. 100 కోట్లు వసూలు చేసింది. దీనిబట్టి చూస్తే టాలీవుడ్‌లో ఈసారి వచ్చిన సినిమాలు అన్ని మంచి కలెక్షన్లు రాబట్టాయనే చెప్పాలి. ఇక త్వరలోనే రవితేజ, ప్రభాస్, చిరంజీవి వెంకటేష్ బాలయ్య లాంటి స్టార్ హీరోల సినిమా విడుదల కానున్నాయి. మరీ వీళ్ల సినిమాలు ఎంత పెద్ద విజయం సాధిస్తాయనేది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాలి.