టాలీవుడ్ లో హీరోయిన్స్ శృతిహాసన్ కెరియర్ మొదలుపెట్టి ఎన్నో సంవత్సరాలు అవుతోంది.. అయినప్పటికీ కూడా శృతిహాసన్ కెరియర్ ఇంకా ఇప్పటికి జెట్ స్పీడులో దూసుకుపోతోంది. మొదట్లో ఐరన్ లెగ్గుగా పేరుపొందిన ఈ ముద్దుగుమ్మ కెరియర్ను గబ్బర్ సింగ్ సినిమాతో మారిపోయిందని చెప్పవచ్చు. ఇక తర్వాత ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు పొందింది. ఆ తర్వాత మళ్లీ ప్రేమ వ్యవహారాల వల్ల కాస్త నిరుత్సాహపడి దాదాపుగా 4 సంవత్సరాలు సినిమాలకు ఉండడం జరిగింది.
కానీ రవితేజ నటించిన క్రాక్ సినిమాతో మళ్లీ రియంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ తరువాత బాలయ్యతో చిరంజీవితో కలిసి సినిమాలలో నటించి ఈ ఏడాది మొదట్లోనే బ్లాక్ బాస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకుంది. శృతిహాసన్ ప్రస్తుతం సీనియర్ హీరోలు జూనియర్ హీరోలు అని తేడా లేకుండా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది. తాజాగా శృతిహాసన్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. శృతిహాసన్, చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య సినిమా ఆడియో ఫంక్షన్ కి హాజరు కాకపోవడంతో పలు రకాలుగా వార్తలు వినిపించాయి.
ఈ వార్తలకి చెక్ పెడుతూ సోషల్ మీడియా వేదికగా శృతిహాసన్ గతంలో తనకు అనారోగ్య సమస్య కారణంగా రాలేకపోయానని తెలిపింది. ఇప్పుడు తాజాగా వాల్తేరు వీరయ్య సినిమాలో డాన్సులు తనతో బలవంతంగా చేయించారని తెలియజేస్తోంది. ముఖ్యంగా మంచులో డాన్స్ చేయడం చాలా కష్టంగా ఉంటుందని అందులో చలికి తట్టుకొని నిలబడడం చాలా కష్టము హీరోలకు మాత్రం చలి లేకుండా జాకెట్లు వేస్తారు కానీ హీరోయిన్లకు అలాంటివి ఉండవు కేవలం చీర చిన్న జాకెట్ వేసుకొని మంచులో డాన్స్ చేయాలి హీరోయిన్ల విషయంలో ఇలాంటివి ఆపాలని కోరుకుంటున్నాను అని తెలిపింది శృతిహాసన్ ప్రస్తుతం ఈ విషయం మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది.