నాగచైతన్యని రోజూ తలుచుకుంటున్న సమంత.. సంచలనం సృష్టిస్తున్న ఆ పోస్టు?

టాలీవుడ్ క్యూట్ కపుల్స్‌లో నాగచైతన్య, సమంతల జంట కూడా ఒకటి. అయితే అదంతా ఒకప్పుడు. ‘ఏ మాయ చేసావే’ సినిమాలో జంటగా నటించి ఇండస్ట్రీకి పరిచయమైయ్యారు నాగచైతన్య, సమంత. ఆ సమయంలో వారి మధ్య స్నేహం కుదిరింది. ఆ తరువాత స్నేహం కాస్త ప్రేమగా మారింది. వారి ప్రేమిను పెళ్లి పీటలెక్కించుకున్నారు ఈ జంట. ఇక నాలుగేళ్ల వైవాహిక జీవితంలో కొన్ని మనస్పర్థల కారణంగా వారిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక అప్పటి నుంచి వారి విడాకుల విషయంపై ఎప్పడు ఏదో ఒక కామెంట్స్ వస్తూనే ఉంటాయి.

ఈ క్రమంలోనే తాజాగా సమంత షేర్ చేసిన ఒక పోస్ట్ వైరల్ గా మారుతుంది. నాగచైతన్య, సమంత పెళ్లి తరువాత శివ నిర్వణా దర్శకత్వం వహించిన సినిమా మజిలీ. ఈ అందమైన ప్రేమ కథా చిత్రం 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో చైతన్య, సామ్ భార్యాభర్తలుగా అదరగొట్టారు. అయితే మజిలీ సినిమా రిలీజ్ అయ్యి నిన్నటికి నాలుగేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సమంత ఆనాటి జ్ఞాపకాలను తలుచుకుంటూ అభిమానులతో పంచుకుంటూ ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది.

సోషల్ మీడియాలో మజిలీ సినిమాకి సంబంధించిన మెమొరీస్ ని షేర్ చేస్తూ ఐ లవ్ యూ అంటూ దర్శకుడు శివ నిర్వణాపై ప్రేమ కురిపించింది. డైరెక్టర్ శివతో కలిసి మజిలీ సెట్స్ లో సందడి చేసినా ఫోటోలను అభిమానులతో షేర్ చేస్తూ శ్రావణి లాంటి పాత్ర ఇచ్చినందుకు ఐ లవ్ యూ.. ఇక ఖుషి సినిమాలో ఆరాధ్య అనే పాత్రతో అదరగొడదాం అంటూ కామెంట్ చేసింది. కానీ చైతన్య గురించి మాత్రం ఏం మాట్లాడలేదు. దాంతో కొంతమంది ‘మజిలీ సినిమా గుర్తుచేసుకుంటుంది అంటే నాగచైతన్య ని మిస్ అవుతుందేమో ‘ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అలానే ఎప్పటికైనా సమంత, నాగచైతన్య ఒకటి కావాలి అని కోరుకుంటున్నారు.