ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత తన గొప్ప మనసు చాటుకుంది. స్టార్ హీరోలు కూడా చేయని పని చేసి శభాష్ అనిపించుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రీసెంట్ గా ఈ బ్యూటీ `శాకుంతలం` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. గుణశేఖర్ రూపొందించిన ఈ ఎపిక్ లవ్ స్టోరీలో సమంత, మలయాళ నటుడు దేవ్ మోహన్ జంటగా నటించారు.
దిల్ రాజు, నీలిమ గుణ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఏప్రిల్ 14న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించడంతో పూర్తిగా విఫలం అయింది. టాక్ అనుకూలంగా లేకపోవడంతో ఈ మూవీ వైపు ప్రేక్షకులు కన్నెత్తి కూడా చూడటం లేదు. రెండో రోజుకే బాక్సాఫీస్ వద్ద వసూళ్లు దారుణంగా పడిపోయాయి.
శాకుంతలంకు రూ. 10 కోట్లకు పైగా నష్టాలు రావడం ఖాయమని సినీ పండితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ‘శాకుంతలం’ నష్టాలను పూడ్చేందుకు సమంత ముందుకు వచ్చింది. తాను ఈ చిత్రానికి తీసుకున్న రెమ్యునరేషన్ లో సగాన్ని వెనక్కి ఇచ్చేసిందట. శాకుంతలంకు సమంత రూ. 8 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకోగా.. అందులో ఇప్పుడు రూ. 4 కోట్లు మేకర్స్ కు రిటర్న్ చేసిందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సినిమా ఫ్లాప్ అంటే చాలా మంది స్టార్ హీరోలు నిర్మాతల వైపు కన్నెత్తి కూడా చూడరు. కానీ, తాను మాత్రం అలా కాదని సమంత నిరూపించుకుంది. స్టార్ హీరోలు కూడా చేయని పని చేసి అందరి చేత గ్రేట్ అనిపించుకుంది.