మరొకసారి సంచలన పోస్ట్ షేర్ చేసిన రేణు దేశాయ్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. పవన్ కళ్యాణ్ తో బద్రి, జానీ వంటి సినిమాలలో నటించిన ఈ అమ్మడు పవన్ కళ్యాణ్ వివాహం చేసుకొని మంచి పాపులారిటీ సంపాదించింది. కానీ 2012లో పవన్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత తన పిల్లలతో కలిసి జీవిస్తోంది రేణు దేశాయ్.. ఈమె సినిమాలలో నటించకున్న సోషల్ మీడియాలో తరచూ ఆక్టివ్ గానే ఉంటూ తన కుటుంబం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తూ ఉంటుంది.

Renu Desai Returns To Big Screen After 18 Yrs With Ravi Teja's 'Tiger  Nageswara Rao'

అలాగే తమ ఫ్యామిలీ ఫోటోలను కూడా వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది రేణు దేశాయ్ ..తాజాగా ఒక వీడియోను షేర్ చేయడం జరిగింది.. అదేమిటంటే మండుటెండలో చల్లని వసంత గాలిలో కొంతమంది మన జీవితంలోకి అనుకోకుండా వస్తారు వారి చూపులతోనే నేరుగా మన మనసుతో మాట్లాడుతారు అదొక మూగ భాష మనం వారితో కొన్ని గంటలు గడిపినప్పటికీ వారి ప్రభావం మన పైన శాశ్వతంగా ఉంటుంది. కానీ వాటిలో చాలా వరకు బాధాకరమైనవి ఉండవచ్చు అంటూ తెలిపింది. కానీ మరి కొంతమంది మాత్రం మన జీవితాన్ని పరిపూర్ణం చేస్తారు మన కన్నీళ్లను తుడిచి కాంతిని పంచుతారు అంటూ అక్షరాల రూపంలో రాసుకుంది రేణు దేశాయ్..

Renu Desai reveals suffering from heart and health issues; Pens a  courageous post | PINKVILLA

ఇదంతా ఇలా ఉంటే ప్రస్తుతం రేణు దేశాయ్ తన కుమారుడు అఖీరా నందన్ కోసం ఫారెన్ కి వెళ్ళినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వీడియోను కూడా షేర్ చేసింది. గత కొన్నేళ్ళుగా సినిమాలకు దూరంగా ఉన్న రేణు దేశాయ్ రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా తో టాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నది. ఇందులో ఈమె హేమలతాల వనం అనే పాత్రలో నటిస్తున్నది.

 

View this post on Instagram

 

A post shared by renu desai (@renuudesai)