నేనేం తప్పు చేశాను..? నేనెందుకు మారాలి..? రేణు దేశాయ్ మ‌రో సంచ‌ల‌న పోస్ట్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ స‌తీమ‌ణి, ప్ర‌ముఖ న‌టి రేణు దేశాయ్ ఇటీవ‌ల త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తోంది. మొన్న‌టికి మొన్న `మా అన్న(పవన్ కళ్యాణ్ ) కొడుకును చూపించండి` అని అకీరాను ఉద్దేశించి ఓ నెటిజ‌న్ కామెంట్ చేసినంద‌కు రేణు దేశాయ్ నానా ర‌చ్చ చేసేసింది. అకీరా నా కొడుకు.. మీ అన్న కొడుకు ఏంటి? అంటూ మండిప‌డింది.

ఈ విష‌యంలో రేణు దేశాయ్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ మ‌ధ్య వార్ న‌డుస్తూనే ఉంది. తాజాగా రేణు దేశాయ్ మ‌రో సంచ‌ల‌న పోస్ట్ తో హెడ్ లైన్స్ లో నిలిచింది. పవన్ అభిమానుల్లో కొంద‌రు రేణు దేశాయ్ కి ఓ సలహా ఇచ్చారు. `పవన్ పాలిటిక్స్ లో ఉన్నారు. ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి యాంటీ ఫ్యాన్స్ పవన్ అభిమానుల మాదిరి మీకు తప్పుడు సందేశాలు పంపవచ్చు. కాబట్టి మీరు ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో కామెంట్స్ సెక్షన్ ఆఫ్ చేయండి` అంటూ సూచించారు.

దీంతో రేణు దేశాయ్ మ‌రింత ఆగ్ర‌హానికి గురైంది. `సమాజంతో ఇదే స‌మ‌స్య‌. ఎవరి కోసమో నేను మారాలా? మీరు చెప్పినట్లు జీవించడానికి నేనేం తప్పు చేశాను. సలహా ఇవ్వడం చాలా ఈజీ. బాధ అనుభవించే వాళ్లకు నొప్పి తెలుస్తుంది.` అంటూ స్ట్రోంగ్ కౌంట‌ర్ ఇచ్చింది. దీంతో రేణు పోస్ట్ కాస్త వైర‌ల్ గా మారింది.