`గేమ్ ఛేంజ‌ర్‌` పాట‌ల ఖ‌ర్చుతోనే 5 సినిమాలు తియ్యెచ్చు.. తెలుసా?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకుంటున్న పాన్ ఇండియా చిత్రం `గేమ్ ఛేంజ‌ర్‌`. ఇందులో కియారా అద్వానీ, అంజ‌లి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు మరియు శిరీష్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. తమన్ స్వ‌రాలు అందిస్తున్నారు.

2021లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయింది. ఇప్ప‌టికే 80 శాతం షూటింగ్ కంప్లీట్ అయింద‌ని తెలుస్తోంది. హైదరాబాద్, న్యూజిలాండ్, ఏపీ, మహారాష్ట్ర , విశాఖపట్నం, పంజాబ్ త‌దిత‌ర చోట్ల ఈ మూవీ షూటింగ్ జ‌రిగింది. వచ్చే ఏడాది సంక్రాంతికా లేదా వేసవిలో ఈ మూవీ రిలీజ్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి.

ఇక‌పోతే ఈ సినిమాలోని పాట‌ల బ‌డ్జెట్ అంద‌రికీ షాకిచ్చింది. ఎందుకంటే, `గేమ్ ఛేంజ‌ర్‌` పాట‌ల ఖ‌ర్చుతోనే 5 సినిమాలు తియ్యెచ్చు అని అంటున్నారు. ఈ మూవీతో మొత్తం ఐదు పాట‌లు ఉండ‌గా.. ఒక్కో సాంగ్ కోసం ఏకంగా రూ. 10 కోట్లు ఖ‌ర్చు పెట్టార‌ట‌. అంటే కేవ‌లం సాంగ్స్ కోస‌మే రూ. 50 కోట్లు ఖ‌ర్చు చేశారని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ప్రచారం జ‌రుగుతోంది. మ‌రి ఈ ప్ర‌చారం ఎంత వ‌ర‌కు నిజం అన్న‌ది తెలియాల్సి ఉంది.