మంచు-మెగా ఫ్యామిలీల మధ్య విభేదాలు ఉన్నాయని ఎప్పటి నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి, మంచు మోహన్ బాబు మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్ గొడవలు ఉంటాయని అందరూ అంటుంటారు. కానీ, ఎన్నో సార్లు ఈ వార్తలను చిరంజీవి, మోహన్ బాబు ఖండించారు. పైగా మంచు మనోజ్, మంజు లక్ష్మి మెగా ఫ్యామిలీతో చాలా క్లోజ్గా ఉంటారు.
ఈ సన్నిహిత్యంతోనే తాజాగా మంచు మనోజ్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన దంపతులు స్పెషల్ గిఫ్ట్ పంపారు. ఇటీవలె మనోజ్ ఓ ఇంటివాడు అయిన సంగతి తెలిసిందే. దివంగత భూమా నాగిరెడ్డి కూతురు మౌనికా రెడ్డితో మనోజ్ ఏడడుగులు వేశాడు. ఈ క్రమంలోనే నూతన దంపతులకు రామ్ చరణ్ దంపతులు పాలరాతితో చేసిన జంట స్వేచ్చగా విహరిస్తున్నట్లుగా ఉన్న ఓ బహుమతిని పంపించారు.
దీంతో ఉప్పొంగిపోయిన మంచు మనోజ్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. `ఇలాంటి సర్ ప్రైజ్ గిఫ్ట్ లు ఎంతో ప్రేమతో కూడుకున్నవి. మాపై ప్రేమను చూపిన స్వీట్ కపుల్ రామ్ చరణ్, ఉపాసనకు ధన్యవాదాలు. లవ్ యూ మిత్రమా. మీరు మాల్దీవుల ట్రిప్ ముగించుకుని రాగానే.. మిమ్మల్ని కలవాలనుకుంటున్నా. మీ ట్రిప్ అద్భుతంగా సాగాలి` అని ట్వీట్ చేశారు. దీంతో మనోజ్ ట్వీట్ కాస్త వైరల్ గా మారింది.
https://twitter.com/HeroManoj1/status/1644961595569885185?s=20