హీరోయిన్లపై మరొకసారి అలాంటి కామెంట్లు చేసిన రాధిక ఆప్టే..!!

బాలీవుడ్ హీరోయిన్స్ సైతం టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి బాగానే ఆకట్టుకున్నారు.. అలాంటి వారిలో హీరోయిన్ రాధిక ఆప్టే కూడా ఒకరు.. రక్త చరిత్ర సినిమాతో ఎంట్రీ ఇచ్చి..నందమూరి బాలకృష్ణతో లెజెండ్ సినిమాలో నటించింది. సౌత్ ఇండియాలో ఈమెకి గోల్డ్ బ్యూటీగా పేరు సంపాదించుకుంది. ఈమధ్య ఈమె సౌత్ సినిమాలకు చెక్ పెట్టి..కాంట్రవర్షల్ కామెంట్స్ న్యూస్ లో నిలుస్తూనే ఉంది.. తాజాగా ఈ అమ్మడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసి బాలీవుడ్లో హాట్ టాపిక్ గా నిలిచింది.

Radhika Apte says she was told to get 'lots of jobs' on her body and face:  'I am sick and tired of people…' | Entertainment News,The Indian Express
అయితే ఆమె మాత్రమే కాదు. గతంలో చాలా మంది హీరోయిన్స్ ఈ విషయంపై మాట్లాడడం జరిగింది. ఇప్పటికే హీరోయిన్స్ రెమ్యూనరేషన్ గురించి చాలామంది మాట్లాడారు. రాధిక కూడా ఈ విషయంపై స్పందించడం జరిగింది.. ఈ మధ్యకాలంలో మగవారికి ఆడవారికి ఏమీ తేడా లేదు. ప్రతి విషయంలోనూ మగవారితో పోటీపడి మరీ చేస్తున్నారు. ఒకప్పుడు మగవారు మాత్రమే ఓరియాంటెడ్ సినిమాలను చేసేవారు.. ఇప్పుడు ఆడవారు కూడా అందులో తగ్గేదే లేదు అన్నట్లు చేస్తున్నారు. రెమ్యూనేషన్ విషయం మాత్రం ఎందుకు తగ్గించాలి. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఇతర మహిళలకు రెమ్యూనరేషన్ మర్యాద, పేరు సమానంగా ఉండాలని చెప్పుకొచ్చింది.

సినిమా రంగంలో రాణించటానికి మగవారు ఎంత కష్టపడతారో ఆడవారు కూడా అంతే కష్టపడతారు. అలాంటి వారిని మనం గౌరవంగా మాట్లాడి వారిని స్వాగతించాలి అని తెలుపుతోంది రాధిక ఆప్టే.ఒక ఇండస్ట్రీలోనే కాకుండా ఇతర రంగాలలో కూడా ఆడ, మగ అనే డిఫరెంట్ లేని పరిస్థితి ఏర్పడాలని తన అభిప్రాయంగా తెలుపుతోంది. ఇప్పుడు ఈమె మాటలు బి టౌన్ హాట్ టాపిక్ గా మారాయి. అయితే రాధిక ఇలా కామెంట్స్ చేయడం ఇదేమి కొత్త కాదు. గతంలో ఎన్నో విషయలపై కామెంట్లు చేయడం జరిగింది… ఏదేమైనా ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ రెమ్యూనరేషన్ పై పలువురు మాట్లాడడం జరుగుతూనే ఉంది.