ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత `శాకుంతలం` సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అయిన సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన ఈ ఎపిక్ లవ్ స్టోరీ ఏప్రిల్ 14న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే సమంత చిత్ర టీం తో కలిసి సౌత్ తో పాటు నార్త్ లోనూ సినిమాను గట్టిగా ప్రమోట్ చేస్తోంది.
అయితే ఎక్కడికి వెళ్లిన సమంత తాను పడ్డ కష్టాల గురించి ప్రస్తావిస్తూ సింపతి క్రియేట్ చేస్తోంది. నాగ చైతన్యతో విడిపోయాక తాను గడిపిన చీకటి రోజులను గుర్తు చేసుకుంటూ హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. మొన్నటికి మొన్న యశోద విడుదల సమయంలో తాను మయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్నానని.. నిలబడటం కూడా కష్టంగా ఉందంటూ తన మీద సింపతి వచ్చేలా ఇంటర్వ్యూ ఇచ్చింది. యశోద ప్రమోషన్స్ కు అది బాగా వర్కౌట్ అయింది. సినిమా బ్లాక్ బస్టర్ అయింది.
ఇక ఇప్పుడు శకుంతల ప్రమోషన్స్ లోనూ సమంత అదే బాటలో వెళ్తోంది. తన వైవాహిక జీవితంలో నిజాయితీగా ఉన్నాను అంటూ ఎప్పుడో జరిగిపోయిన విడాకుల సంగతిని కొత్తగా ఎత్తుకుంటుంది. పదే పదే అవే విషయాలను చర్చిస్తూ హాట్ టాపిక్ అవుతోంది. దాంతో శాకుంతలంకు కావాల్సినంత బజ్ క్రియేట్ అవుతోంది. అయితే ఇది నచ్చని కొందరు నెటిజన్లు సమంతను ఏకేస్తున్నారు. హిట్ కోసం రోజురోజుకు ఇంతగా దిగజారాలా.. సిగ్గు లేదా అంటూ మండిపడుతున్నారు. మరికొందరు సమంతకు సపోర్టుగా నిలబడుతున్నారు.