డైరెక్టర్ రాఘవేంద్రరావు పై సంచలన వ్యాఖ్యలు చేసిన పోసాని..!!

సినీ ఇండస్ట్రీలో నటుడు పోసాని కృష్ణ మురళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. గతంలో ఎన్నో సినిమాలకు నిర్మాతగా రచయితగా కూడా వ్యవహరించారు.చివరికి కమెడియన్ గా పలు చిత్రాలలో నటించి బాగానే ఆకట్టుకున్నారు. అయితే గడిచిన రెండు రోజుల క్రితం నుంచి టాలీవుడ్ సెలబ్రిటీల పైన పెను సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు పోసాని.. ముఖ్యంగా నంది అవార్డులను కమ్మ అవార్డులంటూ షాకింగ్ కామెంట్లు చేయగా బాలకృష్ణ పైన కూడా పలు షాకింగ్ కామెంట్లు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా డైరెక్టర్ రాఘవేంద్రరావు గురించి మాట్లాడుతూ పెను సంచలన వ్యాఖ్యలు చేశారు.

పోసాని మాట్లాడుతూ ఇండస్ట్రీలో రాఘవేందర్రావు ఎంతో గొప్ప డైరెక్టర్ ఆయన అంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు. వైసిపి ప్రభుత్వం గెలిచిన తర్వాత నటుడు పృధ్విరాజ్.. ఎస్వీబీపీ చైర్మన్గా నియమించారు. ఆ సమయంలో పృథ్విరాజ్ తనకు ఫోన్ చేసి డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు చాలా అవినీతి పనులు చేశారు నేను వాటిని కక్కిస్తానని చెప్పారట.. ఆయన ఏం అవినీతి చేశారో నాకు తెలియదు.. కానీ ఒకరోజు రాఘవేందర్ రావు గారు ఉదయం ఫోన్ చేసి ఏం పోసని నేను ఏదో అవినీతి చేశాను అట పృథ్విరాజ్ అవన్నీ కక్కిస్తారట అని చెప్పగా.. సార్ మీరు లంచాలు తిన్నారో లేదో నాకు తెలియదు కానీ.. నేను చెబుతాలేండి అని చెప్పానని తెలిపారట.

ఇక తర్వాత పృధ్విరాజ్ కు ఫోన్ చేసి..ఆయన పెద్దాయన ఎంతో మంచివారు చిన్న చిన్న వాటికి ఆశపడారని చెప్పాను.. ఆ విషయం పృథ్వి రాజుకు చెప్పగానే నాకు రాఘవేంద్రరావు గారు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పారు.. ఎప్పుడైతే పృథ్విరాజ్ కు పదవి పోయింది ఆ క్షణం రాఘవేంద్రరావు గారు మరొకసారి ఫోన్ చేసి.. హా హా హా మురళి అన్నారు.. తనని తిట్టిన పృథ్వీరాజుకు పిలిచి వేషం ఇచ్చారు.. తనకు మాత్రం వేషం ఇవ్వలేదని తెలిపారు. అందుకు గల కారణం వైసీపీలోనే కొనసాగడమే అని పోసాని వెల్లడించారు.. తనతో పని చేయించుకుంటూ నన్ను ఒక విలన్ గా చేశారని తెలిపారు. ముఖ్యంగా జగన్ గారి పైనా ఆయనకు చాలా కోపం ఉందంటూ తెలిపారు పోసాని.