మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన పూజ హెగ్డే..!!

ముకుంద సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ పూజా హెగ్డే.. తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది. ఈ ముద్దుగుమ్మ మొదట మాస్క్ అనే తమిళ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ 2012లో వచ్చిన ఒక లైలా కోసం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది. ఆ తర్వాత డీజే ,రంగస్థలం ,మహర్షి, అరవింద సమేత, అలవైకుంఠపురం ,వంటి సినిమాలలో నటించి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంది.
Big Day Ahead For Pooja Hegde!
అతి తక్కువ కాలంలోని స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించిన పూజ హెగ్డే ఈ మధ్యకాలంలో బాలీవుడ్లో కూడా పలు సినిమాలలో నటిస్తోంది. కానీ అక్కడ పెద్దగా సక్సెస్ కాలేకపోతోంది అనే వార్తలైతే వినిపిస్తున్నాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సక్సెస్ విషయంపై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.. సక్సెస్ అనేది కేవలం ఒక్క రాత్రిలో వచ్చింది కాదని తెలియజేస్తోంది. తెలుగు, తమిళ్ భాషలలో నటిస్తున్న మొదటి రోజుల్లో భాష రాక చాలా ఇబ్బందులు పడ్డాను ఇప్పుడు సంభాషణలను ముందుగా సహాయ దర్శకులను చంపమని ఆ తర్వాతే తాను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలియజేసింది.
Pooja Hegde celebrates 15 million followers on Instagram, introduces her team - India Today
ఇటీవల కాలంలో తాను నటించిన ఏ చిత్రాలు కూడా పెద్దగా ఆడట్లేదని అందుకే తనకు అవకాశాలు రావడం లేదని తన ఇంట్లో కూర్చొని ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయని తెలుపుతోంది. అలాంటిదేమీ లేదు ప్రస్తుతం కొత్త కొత్త సినిమా ప్రాజెక్టులు వస్తూనే ఉన్నాయని తెలిపింది. ఇప్పుడు నటిగా మంచి స్థాయిలో ఉన్నానని.. ఆరంభంలో చాలా కష్టాలు పడ్డారని తనకు డ్రీమ్ ప్రాజెక్టులు చాలానే ఉన్నాయని.. ముఖ్యంగా మహిళలలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే కథ పాత్రలో నటించాలని ఉందని తెలుపుతోంది పూజా హెగ్డే.