బాలీవుడ్ లో మోస్ట్ లవబుల్ కపుల్స్ లిస్ట్ తీస్తే రణ్బీర్ కపూర్, అలియా భట్ జంట ముందు వరసలో ఉంటుంది. దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమాయణం నడిపించిన ఈ జంట.. ఫైనల్ గా గత ఏడాది వైవాహిక బంధంతో ఒకటయ్యారు. పెళ్లి జరిగిన ఏడు నెలలకే అలియా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ జంట ఫిల్మ్ మేకర్ ఆదిత్య చోప్రా ఇంట్లో దర్శనమిచ్చారు. ఏప్రిల్ 21న ఆదిత్య చోప్రా తల్లి పమేలా చోప్రా కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీంతో బాలీవుడ్ ప్రముఖులందరూ ఆదిత్య చోప్రా కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే అలియా-రణ్బీర్ ఆదిత్య చోప్రా ఫ్యామిలీని పరామర్శించేందుకు వెళ్లారు.
ఇంట్లోకి వెళ్లే క్రమంలో అలియా తన చెప్పులను గుమ్మం ముందే విడిచి వెళ్లింది. అయితే వెనకే వెళ్లిన రణ్బీర్ భార్య చెప్పులను చేతులతో పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్లి పెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో.. రణ్బీర్పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే భార్య చెప్పులు మోసినందుకు కాదు. రణ్బీర్ ఆమె చెప్పులను ఇంట్లో ఉన్న చిన్న గుడి ముందు ఉంచడమే నెటిజన్ల ఆగ్రానికి కారణం అయింది. దీంతో ఎవరైనా చెప్పులను గుడికి ఎదురుగా పెడతారా.. అలియాకు ఉన్న సెన్స్ కూడా నీకు లేదా రణ్బీర్ అంటూ మండిపడుతున్నారు.
https://www.instagram.com/reel/CrTbLC9sgUp/?utm_source=ig_web_copy_link