ప్రముఖ హీరోయిన్ సమంత రీసెంట్ గా `శాకుంతలం` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, నీలిమ గుణ నిర్మించారు. దేవ్ మోహన్ ఇందులో హీరోగా నటించాడు. ఎపిక్ లవ్ స్టోరీగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 14న పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున విడుదలైంది.
కానీ, ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. సమంత అభిమానులు సైతం ఈ మూవీపై పెదవి విరిచారు. టాక్ అనుకూలంగా లేకపోవడంతో ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద దారుణమైన వసూళ్లు వస్తున్నాయి. రూ. 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బిరిలోకి దిగిన ఈ చిత్రం.. వీకెండ్ ముగిసే సమయానికి కనీసం రూ. 4 కోట్ల షేర్ను కూడా రాబట్టలేకపోయింది.
అయితే తాజాగా ఓ నెటిజన్ `శాకుంతలం మూవీ డిజాస్టర్. ఇంత చెత్త సినిమా నేను జీవితంలో చూడలేదు. సమంత డబ్బింగ్ దారుణం. ఇకపై డబ్బింగ్ చెప్పకు. నీ ఓవర్ యాక్షన్ ఆపు` అంటూ సమంతను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. దాంతో సమంత చేసిన పనికి అంతా షాక్ అయ్యాడు. సదరు నెటిజన్ ను సమంత బ్లాక్ చేసేసింది. ఈ విషయంపై సదరు నెటిజన్ మండిపడ్డాడు. `సినిమా బాగోలేదు అన్నందుకు నన్ను బ్లాక్ చేస్తావా? సమంత నువ్వు చాలా ఛీప్` అంటూ మరొక ట్వీట్ వదిలాడు. ఇప్పుడీ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది.
https://twitter.com/rvtweetz9/status/1646860710742315008?s=20