టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా రాణిస్తుంది శ్రుతిహాసన్. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. ఈ ఏడాది మొదట్లో సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య , వీర సింహారెడ్డి రెండు సినిమాలలో శృతిహాసన్ హీరోయిన్గా చేసి రెండు బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకొని మళ్లీ కంబ్యాక్ ఇచ్చింది.
ఇదే కాకుండా ప్రస్తుతం శృతిహాసన్ ప్రభాస్ హీరోగా వస్తున్న పాన్ ఇండియా మూవీ సలార్ లో కూడా హీరోయిన్గా నటిస్తోంది. ఇక శృతిహాసన్ సినిమాల్లోనే కాకుండా వ్యక్తిగత విషయాల్లో ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్లోనే ఉంటుంది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన బాయ్ ఫ్రెండ్ తో ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.
తాజాగా ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన ఫస్ట్ క్రష్ ఎవరు అని అడిగిన ప్రశ్నకు.. ‘ ఈ అమ్మడు ఎవరు ఉహించని విధంగా సమాధానం చెప్పింది. తన ఫస్ట్ క్రష్ హాలీవుడ్ నటుడు బ్రుస్ లీ అని తెలిపింది శ్రుతి ‘. దీంతో ఆమె అభిమానులు షాక్ అయిపోతున్నారు.
ఇన్నాళ్లకు శృతీ తన ఫస్ట్ క్రష్ సీక్రెట్ బయట పెట్టిందని చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఈమె ప్రభాస్ హీరోగా చేస్తోన్న సలార్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉంది ఈ చిన్నది. ఇక శృతిహాసన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి.