స్టేజిపై రచ్చరచ్చ చేస్తున్న శ్రీముఖి.. గ్లామర్ డోస్ పెంచేస్తోంది

తెలుగు నాట బుల్లితెరపై యాంకర్ శ్రీముఖికి తిరుగు లేదు. తన చలాకీతనంతో స్టేజిపై ఆమె నవ్వులు పుట్టిస్తోంది. కార్యక్రమమేదైనా మరింత ఆహ్లాదంగా మార్చేస్తుంది. కంటెస్టెంట్లు, అతిథులు, జడ్జిలు ఇలా అందరితోనూ చాలా కలివిడితనంతో మాట్లాడుతూ ఉంటుంది. ఇవి ఎలా ఉన్నా ఆమె తన అందంతో అందరినీ మైమరిపించేలా చేస్తోంది. రకరకాల గ్లామరస్ డ్రెస్సులలో కనువిందు చేస్తోంది. కొన్ని సందర్భాలలో ఆమె కురచ దుస్తులు వేసుకుని వావ్ అనిపిస్తోంది. ఓవైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సినిమాలలోనూ తళుక్కున మెరుస్తోంది. తాజాగా ఓంకార్ యాంకరింగ్ చేస్తున్న టీవీ షోలో ఆమె పాల్గొని సందడి చేసింది. ఆ సమయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

బిగ్ బాస్ సీజన్ – 4లో కంటెస్టెంట్ మోనాల్ గజ్జర్ ఇటీవల ఓంకార్ యాంకరింగ్ చేస్తే సిక్స్త్ సెన్స్ టీవీ షోలో పాల్గొంది. అదే షోలో బుల్లితెర రాములమ్మ కూడా పాల్గొంది. ఇందులో కూడా చిన్న స్కర్ట్ వేసుకుని శ్రీముఖి పాల్గొంది. అయితే పుష్ప సినిమాలో నీయవ్వ తగ్గేదేలే అంటూ మోనాల్ గజ్జర్ బ్యాక్‌పై సరదాగా ఒక్కటి ఇచ్చింది. దీంతో మోనాల్ సిగ్గుల మొగ్గ అయింది. మరో వైపు యాంకర్ ఓంకార్‌పై కూడా ఆమె సెటైర్ వేసింది. తమను ఎక్స్ పోజింగ్ చేయకుండా అన్నీ కవర్ చేసుకోమంటారని, కానీ ఓంకార్ మాత్రం గ్లామర్ షో చేస్తున్నాడని సరాదాగా వ్యాఖ్యానించింది.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఇక యాంకర్ గా తనదైన శైలిలో మెప్పిస్తున్న శ్రీముఖి 2012లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన జులాయి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఓ వైపు మంచి క్యారెక్టర్స్ వస్తే చేస్తూనే, కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గానూ నటిస్తోంది.