ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపదిద్దుకున్న `పుష్ప ది రైజ్` 2021లో విడుదలై ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశవ్యాప్తంగా తుఫాన్ రేపిన ఈ సినిమాకు `పుష్ప ది రూల్` టైటిల్ తో రెండో భాగం తెరకెక్కుతోంది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్ గా అలరించబోతోంది.
ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా `పుష్ప 2`పై అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది. పుష్ప 1 లోనే చాలా మంది స్టార్ కాస్ట్ ఉన్నారు. ఇప్పుడు పార్ట్ 2లో మరింత మంది ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇందులో భాగంగానే ఓ కీలక పాత్ర కోసం సీనియర్ హీరో, విలన్ జగపతిబాబు ఫిక్స్ అయ్యాడు. తాజాగా `కిసీ కా భాయ్ కిసీ కి జాన్` సినిమా ప్రమోషన్స్ లో జగపతిబాబు ఈ విషయాన్ని రివీల్ చేశారు.
`పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాను. సుకుమార్ లాంటి డైరెక్టర్ తో వర్క్ చేయడం ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. నాకు ఆయన ఎప్పుడూ గొప్ప పాత్రలు ఇస్తారు. పుష్ప 2లో నా క్యారెక్టర్ నాకే ఛాలెంజింగ్ గా అనిపించింది. ఇక అల్లు అర్జున్ ని మొదటిసారి 20 ఏళ్ళ క్రితం ఓ జిమ్ లో చూశాను. అప్పుడు వెంటనే గుర్తుపట్టలేదు. ఆ అబ్బాయి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.` అంటూ జగపతిబాబు చెప్పుకొచ్చారు. దీంతో ఈయన కామెంట్స్ వైరల్ గా మారియి. ఏదేమైనా జగపతిబాబు ఎంట్రీతో పుష్ప 2 మరో లెవల్ కు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.