రమ్యకృష్ణ, రంభ తర్వాత అలాంటి సూపర్ క్రేజ్ దక్కించుకున్న హీరోయిన్ సిమ్రాన్ 90వ దశకంలో తెలుగు చిత్ర పరిశ్రమని ఒక ఊపు ఊపిన హీరోయిన్స్ లో సిమ్రాన్ కూడా ఒకరు. ఈమె అప్పట్లోనే బికినీ వేసి ఎన్నో సంచలనాలు సృష్టించింది. అలాంటి ఈ అందాల భామ టాలీవుడ్ స్టార్ హీరోలైన చిరంజీవి నుంచి బాలకృష్ణ వరకు అందరితో నటించి ఒక్కసారిగా చిత్ర పరిశ్రమను తన వైపుకు తిప్పుకుంది. ఆ తర్వాత పరిశ్రమకు కొత్త హీరోయిన్లు వస్తున్న కొద్ది తన క్రేజ్ తగ్గిపోవడంతో పెళ్లి చేసుకుని కొంతకాలం పరిశ్రమకు దూరంగా ఉంది.
ఇక మళ్లీ తమిళ మూవీ సీమ రాజా సినిమాతో సిమ్రాన్ రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఏకంగా విలన్ క్యారెక్టర్ లోనే నటించి ప్రేక్షకులను మెప్పించింది. అంతేకాకుండా ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ షోలో జడ్జ్ గా చాలా రోజులు చేసింది. ఈ విధంగా సిమ్రాన్ సినిమాల్లోనే కాకుండా వ్యాపార రంగంలో కూడా అదరగొడుతుంది. సిమ్రాన్ అప్పట్లో ఫ్యామిలీ సినిమాలతో పాటు గ్లామర్ షో తో కుర్రకారును తన నటనతో ఆకట్టుకుంది.
ఇక ఈ ముద్దుగుమ్మ వెంకటేష్ తో కలిసి ప్రేమతో రా, కలిసుందాం రా వంటి సినిమాలలో నటించింది. అంతేకాకుండా ఈ సినిమాలు కూడా మంచి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచాయి. అయితే ఈ సినిమాలో నటించే టైంలో వెంకటేష్ ,సిమ్రాన్ మధ్యన ఏదో నడుస్తోందని,వీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధమయ్యారు అంటూ కొన్ని వార్తలు వినిపించాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదు.
ఇక గతంలో సౌందర్య -వెంకటేష్ మధ్యలో కూడా ఎఫైర్ ఉందని, వెంకటేష్ తన భార్యకు విడాకులు ఇచ్చి సౌందర్యని పెళ్లి చేసుకుంటాడంటూ కొన్ని వార్తలు వినిపించినప్పటికీ అందులో ఎలాంటి నిజం లేదు. ఇక అలాంటి వార్తలే సిమ్రాన్ తో నటించిన టైంలో కూడా వినిపించాయి.