చిరంజీవి చేసిన పనికి షాక్ లో వేణు.. అలా చేస్తాడనుకో లేదంటూ..!

జబర్దస్త్ స్టేజ్ పై నవ్వులు పూయించిన వేణు.. ఇప్పుడు బలగం సినిమాతో అందరి మనసులు దోచుకున్నాడు.. ఏకంగా స్టార్ సెలబ్రిటీలు కూడా ఆయనపై ప్రశంసల వర్షం కురిపించడమే కాదు అరుదైన అవార్డులను కూడా సొంతం చేసుకుంటున్నారు. ఒకప్పుడు తన కామెడీ పంచ్ లతో కడుపుబ్బా నవ్వించిన ఈయన బలగం సినిమాతో అందరినీ ఏడిపించాడనే చెప్పాలి. వేణు లో ఇంత ఘాడమైన ఎమోషన్స్ కూడా ఉన్నాయా అని అందరూ ఆశ్చర్యపోయేలా చేసాడు వేణు. దెబ్బకు బాక్సాఫీస్ కూడా వణికిపోయింది . అంతేకాదు దిల్ రాజు నమ్మకం మరొకసారి నిజమయింది.. కథ బాగుంటే సినిమా ఆడుతుందనే నమ్మకమే ఆయనను గెలిపించింది.

డైరెక్టర్ వేణు బలగం సినిమాను చిత్రీకరిస్తూ ఉండగానే చిరంజీవి మెహర్ రమేష్ కాంబినేషన్లో వస్తున్న భోళాశంకర్ సినిమాలో కూడా నటిస్తున్నాడు. సిరిసిల్లలో షూటింగ్ చేయాల్సిన సమయంలోనే ఇటు చిరంజీవి భోలా శంకర్ సినిమాకి కూడా షూటింగ్ చేయాల్సి వచ్చిందట.. అయితే చిరంజీవి భోలా శంకర్ కోసం ఇచ్చిన రెండు రోజుల డేట్ కాకుండా ఇంకో రోజు ఎక్స్ట్రాగా ఉండాల్సి వచ్చింది. మరొకవైపు భోళాశంకర్ షూటింగ్ సెట్లో ఒకరోజు అదనంగా ఉంటే సిరిసిల్లలో చేయాల్సిన షూటింగ్ లేటవుతుంది ఎలా అంటూ వేణు కంగారు పడుతూ ఉన్నాడట.

ఆ విషయాన్ని గమనించిన చిరంజీవి స్వయంగా నిర్మాత దిల్ రాజుకు ఫోన్ చేసి పర్మిషన్ తీసుకున్నాడట వేణు. ఇంకా ఒక్కరోజు ఇక్కడే ఉంటాడు.. కాస్త అడ్జస్ట్ చేసుకోండని దిల్ రాజును రిక్వెస్ట్ చేయడంతో దిల్ రాజు కూడా వెంటనే ఒప్పుకున్నాడట. ఇకపోతే తన ప్రాబ్లంను గమనించి ..దిల్ రాజుతో స్వయంగా చిరంజీవి మాట్లాడ్డం చూసి నేను ఎమోషనల్ అయ్యాను. ఆయన కాళ్ళ మీద పడిపోతూ ఉంటే వద్దని .. సినిమా బాగా తీయమని ప్రోత్సహించారు.. ఇక చిరంజీవి గారు చేసిన పనికి నేను షాక్ లో ఉండిపోయాను. ఒక ఆర్టిస్ట్ అయిన నేను అంత పెద్ద స్టార్ నా గురించి ఆలోచించడం నిజంగా నమ్మలేకపోతున్నాను.. అంటూ చిరంజీవి మంచితనాన్ని మరొకసారి గుర్తు చేశారు వేణు.