అజ్ఞాతంలోకి వెళ్లిన‌ ఛార్మీ.. ఇప్పుడే స్థితిలో ఉందో తెలుసా?

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన అందాల భామల్లో ఛార్మీ ఒకటి. ఆకట్టుకునే అందం, అలరించే నటనతో తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఛార్మీ.. ఆఫర్లు తగ్గిన తర్వాత నిర్మాతగా మారింది. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తో కలిసి నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది.

పూరీ తెర‌కెక్కించిన ప్ర‌తి చిత్రానికి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించింది. అలా ఈమె నిర్మించిన చిత్రాల్లో `ఇస్మార్ట్ శంకర్` బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత పూరి జగన్నాథ్ తో కలిసి లైగర్ చిత్రాన్ని నిర్మించింది. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించారు. భారీ అంచ‌నాల న‌డుమ పాన్ ఇండియా స్థాయిలో గ‌త ఏడాది విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ గా నిలిచింది.

 

ఈ సినిమా దెబ్బకు అటు పూరి జగన్నాథ్‌, ఇటు ఛార్మీ భారీ నష్టాల్లో కోరుకుపోయారు. ఇప్పటికీ ఆ నష్టాల నుంచి కోలుకోలేకపోతున్నారు. ఇక లైగ‌ర్ తర్వాత ఛార్మీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. సోషల్ మీడియాలోనూ సైలెంట్ అయిపోయింది. ప్రస్తుతం ఆమె ఎక్కడ ఉంది.. ఏం చేస్తుంది.. అన్నది ఎవ‌రికీ తెలియదు. అయితే లైగ‌ర్ త‌ర్వాత ఆమె పరిస్థితి దారుణంగా మారిందని ఇన్‌సైడ్ టాక్‌ నడుస్తోంది.