టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ ప్రస్తుతం ఏ పని చేసినా ఆయనకు అనుకూల ఫలితాలు వస్తుండటం గమనార్హం. కరోనా రాకముందు బాలయ్య బాబు కేవలం సినిమాలకు రాజకీయాలకు మాత్రమే పరిమితమయ్యారు. కానీ కరోనా తరువాత బాలకృష్ణ ఓటీటీ రంగంలో అందరిని అలరిస్తున్నారు. తనలో ఉన్న యాంకర్ టాలెంట్ బయటకు తీసి విమర్శకుల నుంచి ప్రశంసలు సైతం అందుకుంటున్నారు.
ఆహా “అన్ స్టాపబుల్” షో… బాలకృష్ణ లో ఉన్న మరో కోణాన్ని చూపించడం జరిగింది. ఈ షో కి సంబంధించిన రెండు సీజన్లు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఈ క్రమంలో ఓటీటీ కంటెంట్ కి సంబంధించి… మంచి మంచి అవకాశాలు బాలయ్యకే వరిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ ఐపిఎల్ టోర్నీ తోలి మ్యచ్లో బాలయ్య కామెంటరీ చెప్పగా ఆ సమయంలో బాలయ్య చెన్నై ఎంత స్కోర్ చేస్తుందో ముందుగానే అంచనా వేసి అందరినీ బాలయ్య ఒకింత ఆశ్చర్యపరిచారు.
ఇక కాలేజ్ రోజులలో నేను క్రికెట్ ఆడేవాడినని బాలయ్య పేర్కొన్నారు. ప్రస్తుతం బాలకృష్ణ…అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో తెలంగాణా యాసలో బాలయ్య డైలాగులు పలకనున్నారు. బ్యాలయ్య తనకు ఎంతో మంది క్రికెటర్లతో పరిచయం ఉందిన్ని కూడా అయన చెప్పుకోచ్చడు.
అంతే కాకుండా తనకు ఇష్టమైన క్రికెటర్ల గురించి కూడా బాలయ్య చెప్పుకొచ్చారు. అనిల్ కుంబ్లే, పాల్ ఆడమ్స్, షేన్ వార్న్ ఈ ముగ్గురు తనకు ఇష్టమైన క్రికెటర్లని బాలయ్య చెప్పుకొచ్చాడు. బాలయ్య చెప్పిన ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.