ఈవెంట్‌లో కూడా ఆపుకోలేని శ్రీదేవి కూతురు.. సెక్సీ పోజులతో అరాచకం..!

బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో తన బోల్డ్, సెక్సీ ఫొటోలతో రచ్చ సృష్టిస్తుంటుంది. వెండితెరపై హోమ్లీ రోల్స్‌ చేస్తున్నా, సోషల్ మీడియాలో మాత్రం జాన్వీ వెస్ట్రన్ డ్రెస్సులతో పాటు బికినీలు, బీచ్‌వేర్‌లలో తన హాట్ పిక్స్ పోస్ట్ చేస్తోంది. పబ్లిక్ ఈవెంట్స్‌లో కూడా ఆమె గ్లామరస్ పెర్ఫార్మెన్స్ ఇస్తోంది. అయితే, NMACC ఈవెంట్‌లో జాన్వీ తన సెక్సీ డ్యాన్స్ మూవ్‌లపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది దీన్ని చూసిన కొందరు దీనిని చౌకబారు షో అని పిలిచారు. “అమ్మా, జాన్వీ నీ ప్రతిభ ఎక్కడ, ఇలా సెక్సీ డాల్ గా కనిపించడం తప్ప యాక్టింగ్ చేసేది ఏమైనా ఉందా?” అని కొందరు అడిగారు. మరికొందరు ఆమెను ప్రశంసించారు. బెస్ట్ డ్యాన్సర్‌గా కితాబిచ్చారు.

ఇకపోతే కొరటాల శివ తదుపరి చిత్రంలో ఎన్టీఆర్‌తో జాన్వీ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది. రాజమౌళి RRR తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు ఇటీవల, జాన్వీ తన ప్రియుడు శిఖర్ పహారియాతో కలిసి ముంబైలోని కలీనా విమానాశ్రయంలో కనిపించింది. ఇద్దరూ మ్యాచింగ్ వైట్ డ్రెస్‌లు ధరించి, విడివిడిగా కార్లలో వెళ్లిపోయారు. జాన్వీ దివంగత నటి శ్రీదేవి, నిర్మాత బోనీ కపూర్ కుమార్తె. ఆమె 2018లో ధడక్ చిత్రంతో తన నటనను ప్రారంభించింది. అప్పటి నుండి, గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్, రూహితో సహా పలు చిత్రాలలో నటించింది.

 

ఆమె బోల్డ్ పిక్స్, డ్యాన్స్ మూవీ వల్ల విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ, కాస్త కూడా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ముందుకు సాగుతోంది. ఆమె రాబోయే చిత్రాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్‌తో టాలీవుడ్‌లో ఆమె అరంగేట్రం తమకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.