టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా పేరు పొందిన పూజా హెగ్డే ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. ప్రస్తుతం ఇమే సల్మాన్ ఖాన్ సరసన కీసీకీ జాన్ కీసీకా భాయ్ చిత్రంలో నటించింది. ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో వెంకటేష్ కూడా కీలకమైన పాత్రలో నటించారు.అలాగే విలన్ గా జగపతిబాబు కూడా నటిస్తున్నారు. ఇదంతా ఇలా ఉంటే ఈ సినిమా పైన మంచి హైప్ పెట్టుకుంది పూజ హెగ్డే.
మరొకవైపు మహేష్ బాబు సినిమాలో ఈమె జోడిగా నటిస్తోంది. గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి ఈమె చుట్టూ పలు రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి.. సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేస్తోందని వార్తలు కూడా ఎక్కువగా ప్రచారంలో వినిపిస్తున్నాయి. త్వరలోనే వీరిద్దరి వివాహం చేసుకోబోతున్నారంటూ కూడా రూమర్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ విషయంపై కూడా పూజా హెగ్డే క్లారిటీ ఇవ్వడం జరిగింది.తాను ప్రస్తుతం సింగిల్గానే ఉంటున్నానంటూ తెలియజేసింది. ఆ తర్వాత సర్కస్ సినిమా షూటింగ్ సమయంలో నిర్మాత యష్ చోప్రా తనకి కారు బహుమతి ఇచ్చారనే ప్రచారం బాలీవుడ్లో ఎక్కువగా వినిపిస్తోంది.
తలపై వచ్చిన ప్రతి రూమర్ కి సమాచారం ఇచ్చుకోలేక పూజ హెగ్డే చాలా సతమతమవుతోంది.. అందరూ కారు నిర్మాత కారు ఇచ్చారని మాట్లాడుతున్నారు.. అలా ఇచ్చి ఉంటే బాగుండేది అంటూ ఆసక్తికరమైన వాక్యాలు చేసింది. సల్మాన్ ఖాన్ కు జోడిగా బజరంగీ భాయ్ జాన్ సినిమాలో నటించబోతున్నట్లు వస్తున్న వార్తలలో కూడా వాస్తవం లేదని తెలిపింది. బాలీవుడ్లో తన పైన అన్ని నెగిటివ్ ప్రచారాలే జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి చూస్తే పూజ అయింది బాలీవుడ్లోకి వెళ్లి తప్పు చేసింది అన్నట్లుగా అభిమానులు భావిస్తున్నారు. మరి ఈ విషయంపై పూజా హెగ్డే ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.