నటుడు పృథ్వి రాజు పైన సంఘవి సంచలన వ్యాఖ్యలు..!!

ఈ మధ్యకాలంలో ఫీడౌట్ అయిన నటీనటుల సైతం బుల్లితెరపై ఎంట్రీ ఇస్తూ ఉన్నారు.1980-1990 కాలంలో నటులు అందరూ కూడా సెకండ్ ఇన్నింగ్స్ కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చాలామంది సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో కస్తూరి, అర్చన, రాధ, నదియా ,ఇంద్రజ, మీనా ,సంఘవి తదితర హీరోయిన్లు సైతం ఉన్నారు. మళ్లీ బుల్లితెర పైకి రీఎంట్రీ ఇవ్వడానికి ఎంతోమంది నటీమణులు సైతం తెగ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

ఇక హీరోలతో పోల్చుకుంటే ఈ జాబితా హీరోయిన్లదే చాలా పెద్దదిగా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇండస్ట్రీలో మీనా, సంఘవి ,సంగీత ,మహేశ్వరి ప్రిత వంటి హీరోయిన్స్ ఎప్పటికప్పుడు కలుసుకుంటూనే ఉంటారు ఈ నేపథ్యంలోని ఇటీవల ఒక కార్యక్రమంలో భాగంగా వీరందరూ కలిసి రావడం జరిగింది. తాజాగా ఒక టీవీ కార్యక్రమంలో భాగంగా సంఘవి ప్రముఖ నటుడు విలన్ బబ్లు పృధ్వీరాజ్ పైన కామెంట్లు చేసింది. నటుడు పృథ్వీరాజ్ తనను మోసం చేశారని తెలిపింది అతను చేసిన మోసం త్వరగా తెలిసిపోయిందని చెప్పింది.

 

తాజాగా క్యాష్ ప్రోగ్రామ్కు వచ్చిన సంఘవి మహేశ్వరి పృథ్వి ఆకాష్లు ఈ సందర్భంగా పృథ్వి తనను మోసం చేసిన విషయం గురించి బయట పెట్టింది సంఘవి.. ఒకరోజు షూటింగ్ ముగించుకొని రాత్రి వస్తున్న అంతలో పృద్వి వచ్చి తన వైఫ్ ప్రెగ్నెంట్ అని వీళ్ళు కేక్ అడిగితే ఇవ్వడం లేదని అన్నారు..నేను చాలా సీరియస్గా రెస్టారెంట్ కి వెళ్ళిపోయి కేక్ ప్యాక్ చేయించి ఇచ్చాను.. ఆ తర్వాత ఎయిర్పోర్టులో తనని తన వైఫ్ చూశాను వెళ్లి ఎన్నో నెల అని అడిగితే.. ఆమె షాక్ అయ్యింది ప్రెగ్నెంట్ కాకపోయినా అబద్ధం చెప్పి ఆయన కేక్ తీసుకువెళ్లారని సంఘవి నవ్వుతూ తెలిపింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారుతోంది.