చిరంజీవి గ్యారేజీలో మ‌రో కొత్త కారు.. ఇంత‌కీ ధ‌రెంతో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి గ్యారెజ్ లో మ‌రో కొత్త కారు వ‌చ్చింది. తాజాగా అత్యంత విలాస‌మైన మ‌రియు అత్యాధునిక ఫీచ‌ర్లు క‌లిగి ఉన్న టొయోటా వెల్‌ఫైర్ కారును చిరంజీవి కొనుగోలు చేశారు. ఈ కారులో ఏడుగురు దర్జాగా కూర్చొని జర్నీ చేయొచ్చు. ఈ కారు రిజిస్ట్రేషన్ మంగ‌ళ‌వారం జ‌రిగింది.

కొణిదెల చిరంజీవి పేరుతో వాహనం రిజిస్ట్రేషన్‌ అయింది. ఆర్టీఏ అధికారులు ఆల్‌-1 నంబర్‌ కేటాయించారు. రూ.4.70 లక్షలు ఖ‌ర్చు పెట్టి టీఎస్‌09 జీబీ1111 నంబర్‌ను చిరంజీవి కైవసం చేసుకున్నారు. రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌(ఆర్‌సీ) కోసం మంగళవారం ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయానికి చిరంజీవి వచ్చారు.

ఆర్టీఓ రామచంద్రం సమక్షంలో ఫొటో, డిజిటల్‌ సంతకం తదితర ప్రక్రియ పూర్తి చేశారు. ఇంత‌కీ ఈ కారు ధ‌రెంతో చెప్ప‌లేదు క‌దూ.. చిరంజీవి గ్యారేజ్ లోకి వ‌చ్చిన టొయోటా వెల్‌ఫైర్ ధ‌ర రూ. 1.9 కోట్లు. కాగా, సినిమాల విష‌యానికి వ‌స్తే.. `వాల్తేరు వీర‌య్య‌`తో ఈ ఏడాదిని ఘ‌నంగా ప్రారంభించిన చిరంజీవి ప్ర‌స్తుతం మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో `భోళా శంక‌ర్‌` అనే సినిమా చేస్తున్నారు. త‌మ‌న్నా ఇందులో హీరోయిన్ కాగా.. కీర్తి సురేష్ చిరంజీవికి సోద‌రిగా న‌టిస్తోంది. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.