తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయన్న సంగతి తెలిసింది..అక్కినేని నాగేశ్వరరావుకి అప్పట్లో ఎలాంటి డిమాండ్ ఉండేదో చెప్పనవసరమే లేదు. అంతేకాకుండా నాగార్జునకు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే అయితే తన కుమారులు నాగచైతన్య, అఖిల్ కి సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి హీరోలుగా రాణిస్తున్నారు. చైతన్య హీరోయిన్ సమంత ప్రేమించి విడిపోవడం జరిగింది..
ఈమధ్య కాలంలో నాగచైతన్య, అఖిల్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ బాగా ఉన్నప్పటికీ సక్సెస్ కాలేకపోతున్నారు..ఇక ఈ ఫ్యామిలీ ఇప్పటివరకు తమ వ్యక్తిగత విషయాలలో హాట్ టాపిక్ గా నిలిచింది. చాలా వరకు నాగచైతన్య, సమంత విడాకుల విషయం లోనే కాకుండా అఖిల్ ఎంగేజ్మెంట్ చేసుకొని ఆ తరువాత దాన్ని రద్దు చేసుకున్న విషయంపై వార్తల్లో నిలిచాడు.
ఇప్పుడు తాజాగా అక్కినేని వారి ఫ్యామిలీలో ఏదో గొడవలు జరుగుతున్నట్లుగా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా ఫ్యామిలీ అందరితోనూ కాదు నాగచైతన్య, అఖిల్ మధ్య ఏవో విభేదాలు వచ్చాయని తెలుస్తోంది. వాస్తవానికి చెప్పాలంటే నాగచైతన్య వేరు వేరు తల్లులకు పుట్టిన పిల్లలు అయినా కూడా వీరు ఎప్పుడూ అలా అనుకోకుండా ఒకే తల్లికి పుట్టిన పిల్లల్లా కలిసి మెలిసి ఉండడం మనం చూస్తూనే ఉన్నాము
అయితే తాజాగా వీరిద్దరి మధ్య నిజంగానే విభేదాలు ఉన్నాయని క్లారిటీ వచ్చింది. అది ఎందుకంటే.. అఖిల్ బర్తడే కానీ నాగచైతన్య తనకి ట్విట్టర్లో కానీ ఇంస్టాగ్రామ్ లో కానీ ఎటువంటి విషెస్ పెట్టలేదు. విడాకులు తీసుకొని విడిపోయిన సమంత తన మరిదికి బర్తడేకి మాత్రం విషెస్ చెప్పింది. దీంతో చైతు అఖిల్ మధ్య విభేదాల విషయంలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ విషయం మాత్రం తెగ వైరల్ గా మారుతోంది.. ఈ విషయంపై అక్కినేని కుటుంబం ఎలా స్పందిస్తుందో చూడాలి.