మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన ప్రస్తుతం ప్రెగ్నెంట్ అన్న సంగతి తెలిసిందే. పెళ్లి అయిన పదేళ్ల తర్వాత రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ ఫస్ట్ కిడ్ కు వెల్కమ్ చెబుతున్నారు. మరి కొద్ది రోజుల్లోనే ఉపాసన పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది.
మెగా ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు మెగా అభిమానులు కూడా పుట్టబోయే బేబీ కోసం ఎంతో అతృతగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ఉపాసనకు స్పెషల్ గిఫ్ట్ పంపించింది. అలియా భట్ Ed-a-Mamma అనే క్లాథింగ్ ప్లాట్ఫార్మ్ కి బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తోంది. అలియా భట్ గర్భవతిగా ఉన్నప్పుడు ఎడ్-ఎ-మమ్మా (Ed-a-Mamma) అనే క్లాథింగ్ కంపెనీని ప్రారంభించింది.
ఈ కంపెనీ ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ కిడ్స్ కి సంబంధించిన బట్టలను విక్రయిస్తుంటుంది. వెబ్సైట్ ద్వారా 800లకుపైగా ప్రొడక్స్ట్ ఈ కంపెనీ విక్రయిస్తోంది. ఇక ప్రస్తుతం ఉపాసన ప్రెగ్నెంట్ కావడంతో.. అలియా Ed-a-Mamma నుంచి ఉపాసనకు మరియు పుట్టబోయే బేబీకి పలు డ్రెస్సెస్ గిఫ్ట్ గా పంపించింది. దీంతో ఫుల్ ఖషీ అయిపోయిన ఉపాసన తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అలియాకి థాంక్యూ చెప్పింది. కాగా, అలియా భట్ `ఆర్ఆర్ఆర్` సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా నటించింది. ఆ సమయంలోనే అలియా భట్, ఉపాసన మధ్య మంచి సన్నిహిత్యం ఏర్పడింది.