బిడ్డ పుట్టాక నా భర్త రణ్బీర్ కపూర్ మారిపోయాడంటూ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ సంచలన వ్యాఖ్యలు చేసింది. దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమించుకున్న రణ్బీర్, ఆలియా.. గత ఏడాది తమ నివాసంలో వైభవంగా వివాహం చేసుకున్నారు. పెళ్లి జరిగిన ఏడు నెలలకే అలియా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తమ ముద్దుల కూతురుకు `రాహా` అని పేరు పెట్టుకున్నారు.
బిడ్డ పుట్టిన తర్వాత ఆలియా భట్ చాలా వరకు కూతురుతోనే టైమ్ స్పెండ్ చేస్తోంది. కానీ, రణ్బీర్ మాత్రం చేతినిండా ప్రాజెక్ట్లు ఉండటం వల్ల రాహాతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నాడట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపైనే మాట్లాడుతూ ఆలియా భట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. `రాహా ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది. రాహాను మేము ముద్దుగా చీతా అని పిలుస్తాము. మాకు ఎంత అలసటగా ఉన్నా, ఇబ్బందులు ఉన్నా తన ముఖం చూడకనే అవన్నీ పటాపంచలైపోతాయి.
రణబీర్ చాలా సెన్సిటివ్. రాహా పుట్టిన తర్వాత అతడు మరింత సెన్సిటివ్ గా మారిపోయాడు. కూతురు అంటే అతడికి ఎంతో ప్రేమ, మమకారం. ఖాళీ సమయం దొరికిందంటే చాలు రాహాను ఆడిస్తూనే ఉంటాడు. కూతురితో కలిసి కిటికీ పక్కన కూర్చుని టైం స్పెండ్ చేస్తుంటాడు. షూటింగ్స్ వల్ల ఎటైనా వెళ్లాల్సి వచ్చినప్పుడు కూతురు తనను మరిచిపోతుందేమోనని తెగ భయపడిపోతూ ఉంటాడు. అందుకే రణ్బీర్ ప్లేస్ లో నేను కిటికీ దగ్గర కూర్చుని రాహాకు కబుర్లు చెబుతూ తండ్రిని గుర్తు చేస్తూ ఉంటాను` అని ఆలియా చెప్పుకొచ్చింది. కూతురుపై తండ్రి ప్రేమను ఆమె వివరించింది.