అక్కినేని అఖిల్, యంగ్ బ్యూటీ సాక్షి వైద్య జంటగా నటించిన తాజా చిత్రం `ఏజెంట్`. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర నిర్మించారు. ఇందులో మలయాళ మెగాస్టార్ మమ్మట్టి కీలక పాత్రను పోషించారు.
హై ఓల్టేజ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 28న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడటంతో.. బిజినెస్ కూడా భారీగా జరిగింది. నైజాంలో 10 కోట్లు, సీడెడ్ లో 4.50 కోట్లు, ఆంధ్రాలో 14.80 కోట్లకు ఏజెంట్ థియేట్రికల్ హక్కులను కొనుగోలు చేయగా.. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం బిజినెస్ రూ. 29.30 కోట్లు జరిగింది.
అలాగే కర్ణాటక మరియు రెస్టాఫ్ ఇండియాలో 3.80 కోట్లు, ఓవర్సీస్ లో 3.10 కోట్లకు ఏజెంట్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయాయి. ఫైనల్గా ఏజెంట్ వరల్డ్ వైట్ టోటల్ బిజినెస్ 36.20 కోట్లు. ఈ మూవీతో హిట్ కొట్టాలంటే అఖిల్ 37 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. కొండంత లక్ష్యంతో వస్తున్న ఏజెంట్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.