సినీ తారలపై అభిమానులకు ఉండే ఇష్టం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కొంతమంది అభిమానం మొదటి రోజు మొదటి షో సినిమా చూడడంతో ఉంటే మరికొంతమందికి మాత్రం దైవంలో వారిని పూజిస్తూ ఉంటారు. అందులో భాగంగానే తమ అభిమాన తారలకు దేవాలయాలు కూడా కట్టించే స్థాయికి ఎదిగిన సందర్భాలు ఉన్నాయి. ఈ జాబితాలలో హీరోల కంటే హీరోయిన్లు ఎక్కువ ఉంటారని చెప్పవచ్చు. ముఖ్యంగా తమిళనాడులో ఈ సంస్కృతి చాలానే ఉన్నది ఇప్పటికే హీరోయిన్ ఖుష్బూ, నిధి అగర్వాల్ వంటి వారికి ఆలయాలు కూడా నిర్మించారు.
అయితే ఇప్పుడు తాజాగా హీరోయిన్ సమంతకి కూడా గుడి కట్టబోతున్నారు.ఒక అభిమాని అసలు వివరాల్లోకి వెళితే బాపట్ల జిల్లా ఆలపాడుకు చెందిన సందీప్ అనే వ్యక్తి సమంతకు వీరాభిమాని..సమంత అంటే చాలా ఇష్టం ఉండడంతో తన అభిమాన తార మయోసైటీస్ బారిన పడడంతో సందీప్ చాలా తల్లడిల్లిపోయాడట. సమంత వ్యాధి నుంచి కోలుకోవాలని ఏకంగా మొక్కుబడి యంత్రం చేశారు.. అలా తిరుపతి చెన్నై నాగపట్నం లో ఈ యాత్ర చేశారు. ఇలా సమంతపై తనకున్న అభిమానాన్ని చాటుకున్న.. ఈయన ఇప్పుడు మరొకసారి మరొక ముందడుగు వేయడం జరిగింది. ఏకంగా సమంతకు ఆలయాన్ని కట్టించాలని నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.
తన ఇంట్లోనే సమంతకు గుడి నిర్మిస్తున్నాడు. ఏకంగా సమంత పుట్టినరోజున ఏప్రిల్ 28న ఈ గుడిని ప్రారంభించేందుకు ఏర్పాటు చేస్తున్నారు.గతంలో ఎంతో మంది హీరోయిన్లకు గుడి కట్టిన ఘటనలు ఉన్నాయి తాజాగా ఒక తెలుగు వ్యక్తి ఇలా సినీ తారకు గుడి కట్టడంపై అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది