కేజీఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు ప్రశాంత్ నీల్.. ఈ రెండు సినిమాలతో ఈ దర్శకుడికి ఎంతో డిమాండ్ కూడా క్రియేట్ అయింది. ప్రస్తుతం ప్రశాంత్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అవ్వగా ఈ సినిమాను దసరా కానుకగా సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఈ సినిమా తర్వాత ప్రశాంత్ తన తర్వాత సినిమాను యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై అధికార ప్రకటన కూడా వచ్చింది. ఇక ఎన్టీఆర్- కొరటాల శివతో చేయబోయే సినిమా పూర్తి అయన వెంటనే ప్రశాంత్ నీల్ సినిమాలో దిగిపోతాడు. ఎన్టీఆర్ అభిమానులు దృష్టి మొత్తం ప్రశాంత్ నీల్తో చేయబోయే సినిమా పైనే ఉంది.
ఇక రీసెంట్ గానే త్రిబుల్ ఆర్ లోని నాటు నాటు పాటకు ఆస్కార్ కూడా రావడంతో ఎన్టీఆర్ క్రేజ్ పాన్ వరల్డ్ రేంజ్ లో పెరిగింది. అందుకే ఇప్పుడు ఎన్టీఆర్ తో చేయబోయే ప్రశాంత్ నీల్ సినిమాని పాన్ వరల్డ్ స్థాయిలో భారీ యాక్షన్ డ్రామాగా ప్లాన్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. ఇక అందుకోసం ఎన్టీఆర్ సినిమాని హాలీవుడ్ లో కూడా తెరకెక్కించనున్నట్లు తెలుస్తుంది.
అదేవిధంగా ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ పని చేయనున్నారట. అలాగే ఈ సినిమాలో నటించే నటీనటులు కూడా ప్రపంచ స్థాయిలో పేరుపొందిన వారిని తీసుకోనున్నారట. ఇప్పుడు ఏది ఏమైనా ఎన్టీఆర్- ప్రశాంత్ కలయికలో ఎవరు ఊహించని భారీ పాన్ వరల్డ్ సినిమా రాబోతుంది. ఆ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.