నందమూరి వారసుడు, సినీ నటుడు తారకరత్న కొద్ది రోజుల క్రితం కన్నుమూసిన సంగతి తెలిసిందే. గుండె పోటుతో ఆసుపత్రిలో అడ్మిట్ అయిన.. దాదాపు 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఓడారు. ఫిబ్రవరి 22న తారకరత్న తనువు చాలించారు. ఆయన మరణం బాబాయ్ బాలయ్యను ఎంతగానో కృంగతీసింది. తారకరత్నను బతికించుకోవడానికి తల్లిదండ్రుల కంటే ఎక్కువగా బాలయ్య తాపత్రాయపడ్డారు.
మరణానంతరం తారకరత్నకు సంబంధించి అన్ని కార్యక్రమాలను బాలయ్య దగ్గరుండి చూసుకున్నారు. ఇప్పుడు తారకరత్న కుటుంబానికి కూడా ఆయనే పెద్ద దిక్కుగా మారారు. తాజాగా బాలయ్య మరో గొప్ప పని చేశారు. తారకరత్న జ్ఞాపకార్థం బసవతారకం ఆసుపత్రిలో ఒక వార్డుకు ఆయన పేరును బాలయ్య పెట్టారు. గుండె సమస్యలతో బాధపడుతున్న పేదలకు ఈ వార్డులో ఫ్రీగా వైద్య సేవలను అందించనున్నట్టు బాలయ్య అనౌన్స్ చేశారు. దీంతో బాలయ్య మంచి మనసుకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
మరోవైపు తారకరత్న విషయంలో బాలయ్య చేసిన పనికి అలేఖ్య కన్నీళ్లు పెట్టుకుంటూ ఓ పోస్ట్ పెట్టారు. `నేను ఏం చెప్పగలను. మీకు నా కృతజ్ఞలను ఎలా తెలియజేయగలను. బంగారు మనసు కలిగిన గొప్ప వ్యక్తి అని చెప్పడం ఎలాంటి ఆశ్చర్యం లేదు. మీరు మాకు తండ్రి, స్నేహితుడి కన్నా ఎక్కువ. ఇప్పుడు మీలో దేవుడిని చూసుకుంటున్నాను. మీ మంచితనాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవడం లేదు. మీరు మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో.. అంతకంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాము. జై బాలయ్య` అంటూ అలేఖ్య ఎమోషనల్ గా పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.
https://www.instagram.com/p/CqBBUvnqVfe/?utm_source=ig_web_copy_link