చిరంజీవి చేసిన ప‌నికి బాగా హ‌ర్ట్ అయిన మ‌హేష్‌.. ఇప్పుడేం చేస్తాడో?

మెగాస్టార్ చిరంజీవి చేసిన ప‌నికి సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు బాగా హ‌ర్ట్ అయ్యారట‌. అస‌లేం జ‌రిగిందంటే.. చిరంజీవి ప్ర‌స్తుతం మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో `భోళా శంక‌ర్‌` అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వాల్తేరు వీర‌య్య సూప‌ర్ హిట్ అనంతరం చిరు నుంచి రాబోతున్న చిత్ర‌మిది. త‌మిళ సూప‌ర్ హిట్ వేదాళంకు రీమేక్ ఇది. ఇందులో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా హీరోయిన్ గా న‌టిస్తుంటే.. కీర్తి సురేష్ చిరంజీవికి సోద‌రిగా అల‌రించ‌బోతోంది.

అయితే ఉగాది పండుగ కానుక‌గా ఈ సినిమా విడుద‌ల తేదీని మేక‌ర్స్ అనౌన్స్ చేశారు. ఆగస్టు 11న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించి ఓ స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. కానీ, మ‌హేష్ మాత్రం భోళా శంక‌ర్ రిలీజ్ డేట్ విష‌యంలో నిరాశ చెందారు. అందుకు కార‌ణం లేక పోలేదు. ఆగ‌స్టు 11 తేదీని ముందుగా `ఎస్ఎస్ఎంబి 28` కోసం అనుకుంటున్నారు. మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. పూజా హెగ్డే, శ్రీ‌లీల ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఆగ‌స్టు 11న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు.

 

కానీ, ఇప్పుడు అనూహ్యంగా ఆ తేదీపై చిరంజీవి క‌న్నేశారు. ఆగస్టు 11కి మంచి అడ్వాంటేజ్ ఉంది. 15న పండగ 12న సెకండ్ సాటర్ డే మధ్యలో 14 మాత్రమే వర్కింగ్ డే. లాంగ్ వీకెండ్ కలిసొచ్చినట్లు అవుతుంది. అందుకే మ‌హేష్ ముందుగానే ఈ తేదీపై క‌ర్చీఫ్ వేయ‌గా.. ఇప్పుడు చిరు కూడా అదే తేదీకి వ‌చ్చేందుకు రెడీ అయ్యారు. ఇక ఇద్ద‌రు పెద్ద హీరోల సినిమాలు ఒకే రోజు విడుదలైతే బాక్సాఫీస్ వ‌ద్ద క్లాషెస్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ విష‌యం తెలిసి కూడా చిరంజీవి ఆ తేదీనే లాక్ చేసుకోవ‌డంతో మ‌హేష్ కాస్త అస‌హ‌నానికి గుర‌య్యార‌ని టాక్‌.