మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డ్రైరెక్టర్స్ లో ఒకడు. రచయిత కెరీర్ ప్రారంభించి తన పెన్ పవర్ చూపించిన త్రివిక్రమ్.. ఆ తర్వాత డైరెక్టర్ గా మారి ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించాడు. టాలీవుడ్ స్టార్ హీరోగాకు మోస్ట్ వాంటెడ్ గా గుర్తింపు పొందించాడు.
ప్రస్తుతం ఒక్కో సినిమాకు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. కానీ, కెరీర్ ఆరంభంలో త్రివిక్రమ్ ఎన్నో కష్టాలు పడ్డాడు. ప్రముఖ కమెడియన్ సునీల్ తో కలిసి త్రివిక్రమ్ శ్రీనివాస్ భీమవరం నుండి సినిమాల్లో నటించడానికి వచ్చారు. ఇద్దరూ ఒక రూమ్ ని రెంట్ కి తీసుకుని ప్రయత్నాలు మొదలు పెట్టారు. అవకాశాలు కోసం చెప్పులు అరిగిపోయేలా తిరిగారు.
ఇక ఇంటి అద్దె కట్టేందుకు సునీల్, త్రివిక్రమ్ పడ్డ పాట్లు అన్నీ ఇన్నీ కావు. చేతిలో చిల్లిగవ్వ లేక త్రివిక్రమ్ ట్యూషన్స్ చెప్పడం స్టార్ట్ చేశాడు. త్రివిక్రమ్ స్వతహాగా ఒక గొప్ప పండితుడు. దాంతో ఆయన ట్యూషన్స్ చెప్తూ తాను ఉంటున్న రూమ్ కి అద్దె కడుతుండేవాడు. అలా ఆయన ప్రముఖ స్టార్ కమెడియన్ గౌతమ్ రాజు కొడుక్కి కూడా అప్పట్లో ట్యూషన్ చెప్పేవాడట. కట్ చేస్తే త్రివిక్రమ్ ఇప్పుడు డైరెక్టర్ అయ్యి గౌతమ్ రాజు కే అవకాశాలు ఇచ్చే రేంజ్ కి ఎదిగాడంటే అతిశయోక్తి కాదు. ఇక మరోవైపు సునీల్ కూడా నటుడిగా బాగానే సెటిల్ అయ్యాడు.