టాలీవుడ్ లో లవర్ బాయ్ గా పేరు పొందిన తరుణ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే అప్పట్లో ఎన్నో చిత్రాలు నటించి మంచి విజయాలను అందుకున్నారు. ప్రియమణి, తరుణ్ జంట గా కలిసి నటించిన చిత్రం నవవసంతం ఈ సినిమా 2007లో విడుదలై ప్రేక్షకులను బాగా అలరించింది.అయితే ఈ సినిమా సమయంలో ప్రియమణి ,తరుణ్ ప్రేమలో ఉన్నారని వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. అంతేకాకుండా వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు కూడా ఎక్కువగా వినిపించాయి. కానీ ఈ విషయం పైన ప్రియమణి అప్పట్లోనే క్లారిటీ ఇచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి వాటి గురించి తెలుసుకుందాం.
ప్రియమణి మాట్లాడుతూ నవవసంతం షూటింగ్ సమయంలో నేను తరుణ్ ప్రేమలో ఉన్నామని మీమిద్దరం వివాహం చేసుకోబోతున్నామని ఎన్నో వార్తలు వినిపించాయి.. అయితే సినిమా షూటింగ్ సమయంలో ఒకరోజు తరుణ్ తల్లి రోజా రమణి గారు సెట్ లోకి రావడం జరిగింది. మీ ఇద్దరు నిజంగానే ప్రేమలో ఉన్నారా ఒకవేళ అదే కనుక నిజమైతే వివాహం చేసుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ తెలియజేసిందట.. దీంతోపాటు ఏ విషయమైనా సరే నువ్వు నాకు ఫ్రెండ్లీగా చెప్పొచ్చని ప్రియమణి అడిగినట్లు తెలిపింది.
అయితే ప్రియమణి మాత్రం మీరు ఈ విషయం మాకు చెప్పే వరకు తెలియదని.. బయట వాళ్ళు మా గురించి అలా మాట్లాడుకుంటున్నారా అంటూ తెలియజేసిందట. ఓకే హీరోతో వరుసగా రెండు మూడు సినిమాలు చేస్తే ఇలాంటి రూమర్స్ వస్తాయనుకున్న కానీ తరుణ్ తో నేను చేసింది ఒక్క సినిమానే అయినప్పటికీ ఇలాంటి వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.. ఏదేమైనా అవన్నీ అవాస్తవాలే అంటూ తెలియజేసినట్లు తెలుస్తోంది ప్రియమణి. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.