బుల్లితెరకి సుధీర్ ఇక గుడ్ బై చెప్పినట్టేనా..?

మొదట మేజీషియన్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి ఆ తర్వాత కమెడియన్ గా బుల్లితెర పైన పలు షోలలో కనిపించి హీరోగా ఎదిగారు జబర్దస్త్ కమెడియన్ సుధీర్. కామెడీ తో పాటు తన డాన్స్ తో కూడా బాగానే ఆకట్టుకున్నారు. సుధీర్ కెరియర్ లో ఎన్నో షోలకు హోస్టుగా కూడా వ్యవహరించి మంచి పాపులారిటీ సంపాదించారు. ఇక బుల్లితెరపై సుదీర్, రష్మి చేసేటటువంటి ఎలాంటి షో అయినా సరే మంచి టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకుంటూ ఉండేది. మొదటిసారి సుధీర్ సాఫ్ట్వేర్ సుధీర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత త్రీ మంకీ సినిమాతో పెద్దగా ఆకట్టుకోలేకపోయారు.

ఇక తర్వాత ఎన్నో చిత్రాలలో నటించిన సుధీర్ పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. దీంతో ఇతర చానల్స్ లో వెళ్లి పలుషోలకు హోస్టుగా చేశారు. తన వెంట నడిచిన గెటప్ శ్రీను ఆటో రాంప్రసాద్, సన్నీ ని కూడా వారి ఇష్టానికి వదిలేశారు. ఆ తరువాత ఆహా ఓటీటి లో అనిల్ రావిపూడి తో కలసి కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ చేయడం జరిగింది. అయినా సరే ఇక కొత్తగా ఏ టీవీ షో అంగీకరించలేదు. పూర్తిగా తన ఫోకస్ మొత్తం గాలుడు సినిమాపైనే పెట్టారు.

వాస్తవానికి ఇందులో చెప్పుకోదగ్గ కథ ఏమీ లేకపోయినప్పటికీ కొన్ని కోట్ల రూపాయలను కలెక్షన్లు అందుకుంది. కారణం కేవలం సుదీర్ మాత్రమే అన్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాతో సుధీర్ కెరియర్ ఒక్కసారిగా తిరిగిపోయింది. ప్రస్తుతం కాలింగ్ సహస్ర అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే మరొక ప్రాజెక్టుకు కూడా సైన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి చూస్తే సుధీర్ కెరియర్ ఇక వెండితెరకు మాత్రమే పరిమితం అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.