న్యాచురల్ స్టార్ నాని కెరీర్ తెరకెక్కిన తొలి పాన్ ఇండియా చిత్రం `దసరా`. ఇందులో జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. శ్రీకాంత్ ఓదెల ఈ మూవీకి దర్శకత్వం వహించగా.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. సాయి కుమార్, సముద్రఖని, జరీనా వహాబ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.
గోదావరిఖని ప్రాంతంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో తెలంగాణ బ్యాక్డ్రాప్ లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం మార్చి 30న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. ఇప్పటికే బయటకు వచ్చిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ సినిమాలపై మంచి అంచనాలను క్రియేట్ చేశాడు. ప్రచార కార్యక్రమాలతో మేకర్స్ ఆ అంచనాలను మరింత పెంచుతున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. దసరా క్లైమాక్స్ ఎవరూ ఊహించని రేంజ్ లో ఉంటుందట. పైగా క్లైమాక్స్ కోసం భారీగా ఖర్చు పెట్టారట. సినిమా టోటల్ బడ్జెట్ యాబై కోట్లు కాగా.. క్లైమాక్స్ సీన్ కోసమే ఏకంగా ఐదు కోట్ల రూపాయిలను ఖర్చు చేశారట. నాని కెరీర్ లో ఏ సినిమా క్లైమాక్స్ కు ఈ స్థాయి బడ్జెట్ పెట్టింది లేదు. ఇది తొలిసారి అని అంటున్నారు. ఐదు కోట్ల బడ్జెట్ ను కేటాయించిన దసరా క్లైమాక్స్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.