మగాళ్లతో పోలిస్తే నాకేం తక్కువ.. అడుక్కోవలసిన గతి పట్టలేదు: సమంత!

యశోద సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సమంత ఇప్పుడు శాకుంతలం సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేందుకు సిద్ధమయ్యింది. రిలీజ్ మరో రెండు వారాలు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఈ ముద్దుగుమ్మ దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రమోట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ భామ మీడియా అటెన్షన్‌ను గ్రాబ్‌ చేస్తుంది. ఆస్వాదిస్తోంది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2023 ఏప్రిల్ 14న గ్రాండ్ గా విడుదలవుతోంది. ఈ క్రమంలోనే ఈ దూకుడు భామ ఒక ఇంటర్వ్యూలో పారితోషిక సమానత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఆమె తన ఆలోచనలను పంచుకుంటూ, “నేను నేరుగా డబ్బు ఎక్కువగా ఇవ్వాలని పోరాటం లేదు కానీ, కష్టపడి పోరాడుతున్నాను. అంటే నేను సమానంగా రెమ్యునరేషన్ ఇవ్వాలని పోరాడటం లేదు, కష్టపడి విజయం సాధించి మగవారితో సమానంగా పారితోషికం పొందాలని కోరుకుంటున్నాను. ప్రజలు వారంతట వారే నా దగ్గరకు వచ్చి, ‘అవును, మేం మీకు ఇంత మొత్తం చెల్లించాలనుకుంటున్నాం’. అని చెప్పాలి. నేను మగవాళ్ళకి ఏం తక్కువ కాదు. ఎక్కువ డబ్బుల కోసం అడుక్కోవలసిన అవసరం నాకు లేదు. పేమెంట్ ఈక్వాలిటీ గొప్ప కృషితో వస్తుందని నేను నమ్ముతున్నాను.” అని చెప్పుకొచ్చింది.

సామ్‌ ఇంకా మాట్లాడుతూ.. “మీ సామర్థ్యాలు ఏమైనప్పటికీ, మీరు వాటిని పరిమితికి మించి విస్తరించాలి’ అని నా బయోలో నేను ఈ కోట్‌ను ఉంచాను. దీని అర్థం సినిమా పరిశ్రమలో మహిళగా ఉన్నప్పుడు, మీ సామర్థ్యాలను విస్తరించడానికి చాలా కష్టపడాలి. సామర్ధ్యాలకు మించి ముందుకు సాగటం అనుకున్నంత ఈజీ కాద”ని సమంత చెప్పుకొచ్చింది. ఇకపోతే మహాభారతంలోని అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో దేవ్ మోహన్ దుష్యంత్ పాత్రను పోషిస్తుండగా సమంత శకుంతల పాత్రను పోషిస్తోంది.