యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, ప్రముఖ హీరోయిన్ శోభిత దూళిపాళ్ల రిలేషన్షిప్లో ఉన్నారని చాలా కాలం నుంచి వార్తలు వస్తున్నాయి. కొద్ది నెలల క్రితమే సమంతకు విడాకులు ఇచ్చిన నాగచైతన్య.. ఆ తర్వాత శోభిత ప్రేమలో పడ్డాడని, వీరిద్దరి మధ్య సీక్రెట్ ఎఫైర్ నడుస్తుందని ప్రచారం జరిగింది.
కానీ, ఈ ఇద్దరు స్టార్స్ తమ రిలేషన్ పై స్పందించలేదు. అయితే ఇప్పుడు వీరి ఎఫైర్ గుట్టురట్టు అయింది. తాజాగా నాగచైతన్య శోభిత ఒకే రూమ్లో అడ్డంగా దొరికేశారు. అసలేం జరిగిందంటే.. కొద్ది రోజుల క్రితం లండన్ లోని ఒక ప్రముఖ రెస్టారెంట్ కు నాగచైతన్య – శోభిత కలిసి లంచ్ డేట్ కు వెళ్లారు. అయితే అక్కడ పని చేసే సురేందర్ మోహన్ అనే వ్యక్తితో నాగచైతన్య కలిసి ఓ ఫోటో దిగాడు.
కాగా ఇదే ఫోటోను సురేందర్ మోహన్ తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. అయితే ఇదే పిక్ లో నాగచైతన్య వెనక శోభిత దూళిపాళ్ల కూర్చుని ఉంది. దీంతో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారన్న విషయం స్పష్టమైంది. ఇకపోతే ఇటీవల తన కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసిన నాగచైతన్య.. త్వరలోనే శోభితతో ఏడడుగులు వేయడం ఖాయమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.