ఆ విషయంలో బాలయ్య ఓకే… కళ్యాణ్ రామ్ విషయంలో ఏమౌతుందో మరి?

బాబాయ్ బాలయ్య, కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా ఇక్కడ ప్రస్తావించాల్సిన పనిలేదు. అయితే ప్రస్తుతం వారిని గురించి ఓ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. బాలయ్య నటించిన వీరసింహారెడ్డి మూవీ 2023 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో ఒకటిగా నిలిచి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్య పరిచింది. ఈ సినిమా టైటిల్ లాంఛ్ కర్నూలులో జరిగిందని అందరికీ తెలిసిందే. అంతేకాకుండా వీరసింహారెడ్డి సినిమాలోని కొన్ని సన్నివేశాల షూటింగ్ కర్నూలులో జరగడం విశేషం. అయితే కళ్యాణ్ రామ్ కూడా కర్నూలు సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నట్టు సమాచారం.

ఎందుకంటే కళ్యాణ్ రామ్ తాజా సినిమా ‘అమిగోస్’ ట్రైలర్ కర్నూలులోని ప్రముఖ థియేటర్ లో జరగడం విశేషం. దాంతో కళ్యాణ్ రామ్ కు కూడా కర్నూలు సెంటిమెంట్ అచ్చొస్తుందని సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టగా కొంతమంది మాత్రం ఎక్కడో తేడా కొడుతోంది అని కామెంట్ పెట్టడం గమనార్హం. కర్నూలు సెంటిమెంట్ వల్ల బాలయ్యకు ఎన్నో విజయాలు దక్కగా కళ్యాణ్ రామ్ కు కూడా విజయాలు దక్కుతాయేమో వేచి చూడాల్సి ఉంది. కాగా అమిగోస్ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అమిగోస్ ట్రైలర్ కు గంటలో 5 లక్షలకు పైగా వ్యూస్ రావడం కొసమెరుపు.

ఈ నెల 10వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాగా చిత్ర యూనిట్ భారీ స్థాయిలో ప్రమోషన్స్ షురూ చేసారు. కళ్యాణ్ రామ్, అషికా రంగనాథ్ జోడీకి కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. మరీ ముఖ్యంగా నందమూరి బాబులకు ఈ జోడి బాగా నచ్చిందని భోగట్టా. నటుడిగా కళ్యాణ్ రామ్ మొదటి నుండి భిన్నమైన కథలను ఎంచుకుంటూ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ఇకపోతే మొన్నటికి మొన్న బింబిసార సినిమాతో కళ్యాణ్ రామ్ మార్కెట్ అమాంతం అమిగోస్ ఆ మార్కెట్ ను మరింత పెంచుతుందేమో చూడాలి.