ఈ సంక్రాంతికి చిరంజీవి హీరోగా వచ్చిన వాల్తేరు వీరయ్య.. చిరంజీవి కం బ్యాక్ ఇచ్చిన తర్వాత తన రేంజ్ హీట్ అందుకున్న సినిమా కూడా ఇదే. ఈ సినిమాలో చిరు తన నటనతో వింటేజ్ మెగాస్టార్ ని పరిచయం చేశాడు. ఈ సినిమాలో విలన్ గా నటించిన బాబి సింహా నటన కూడా అదేవిధంగా అందరినీ ఆకట్టుకుంది. బాబి సింహా ఈ సినిమాకు ముందు తెలుగు సినిమాల్లో నటించిన ఈ సినిమాతో మరింత పేరు తెచ్చుకున్నాడు.
దీంతో ఇప్పుడు బాబి సింహ ఎవరు అనే విషయం సోషల్ మీడియాలో చర్చ కూడా మొదలైంది.
నిజానికి అతను మన తెలుగు వాడే ఆంధ్రప్రదేశ్లోని బందర్ లో బాబీ సింహా జన్మించడు. ఆ తర్వాత కొన్నాళ్లపాటు బాబీ సింహ హైదరాబాద్లోని మౌలాలిలో కూడా ఉన్నాడు. ఆ తర్వాత కృష్ణాజిల్లా మోపిదేవి వచ్చి అక్కడ తన టెన్త్ క్లాసును పూర్తి చేశాడు.
తన పై చదువులు కోసం కోయంబత్తూర్ వెళ్లిన బాబీ సినిమాల మీద ఉన్న ఆసక్తితో తమిళం నేర్చుకున్నాడు. తన డిగ్రీ పూర్తి అయిన తర్వాత సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చాడు. తమిళ సినిమాల్లో మంచి అవకాశాలు రాబట్టుకున్నాడు. కోలీవుడ్లు పలు సినిమాల్లో హీరోగా కూడా నటించాడు. అలాగే విలన్ గా కూడా నటిస్తూ వచ్చాడు.
బాబీ వ్యక్తిగత విషయాలకు వస్తే.. ఆయన భార్య గురించి చెప్పాలంటే.. వీరిద్దరిదీ ప్రేమ వివాహం.. సహనటి రేష్మి మీనన్ ను ప్రేమించి, 2016లో పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు తండ్రి కూడా అయ్యాడు. ఇక ఈమె తెలుగులో రెండు మూడు సినిమాల్లో హీరోయిన్గా కూడా నటించింది. ఇక ఈ విధంగా బాబి సింహా తన ఫ్యామిలీ లైఫ్ లో ఎంతో హ్యాపీగా ఉన్నాడు.