పెళ్లి పీటల మీద నుంచి పారిపోవాలనుకున్నా.. మంచు లక్ష్మీ..!

సినీ ఇండస్ట్రీలో మంచి పేరు మోసిన కుటుంబాల నుంచి వచ్చిన హీరోయిన్స్ లో మంచు లక్ష్మి కూడా ఒకరు. అయితే ఈమె సినిమాలలో పెద్దగా హీరోయిన్గా సక్సెస్ పొందలేదు.. కానీ ఒకవైపు విలన్ పాత్రలు పోషిస్తూ మరింత పాపులారిటీ దక్కించుకుంది.. ఇదిలా ఉండగా సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందిన తర్వాత సెలబ్రిటీలకు, అభిమానులకు మధ్య దూరం చాలా వరకు తగ్గిపోయింది. ఈ క్రమంలోనే చాలామంది సెలబ్రిటీలు తమ చిన్నప్పటి ఫోటోలను లేదా వారి తీపి జ్ఞాపకాలను, చేదు అనుభవాలను కూడా సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.Manchu Lakshmi shares her marriage unseen photos

ఈ క్రమంలోనే మంచు లక్ష్మి కూడా తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పెళ్లి పీటల మీద నుంచి పారిపోవాలనుకున్నాను అంటూ షాకింగ్ విషయాలు వెల్లడించింది మంచు లక్ష్మి.. మంచు లక్ష్మి తన పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ పెళ్లికూతుర్ని చేసి మండపంలోకి తీసుకురమ్మని చెప్పినప్పుడు చాలా భయం వేసింది. కంగారుపడ్డాను.. ఆ సమయంలో మండపం నుంచి పారిపోవాలని దారి కూడా వెతుక్కున్నాను.. కానీ ఏ దారి దొరకలేదు అంటూ ఆమె సోషల్ మీడియాలో తన అభిమానులతో ఈ విషయాన్ని పంచుకుంది.

2006లో ఆండ్రీ శ్రీనివాస్ అనే వ్యక్తిని మంచు లక్ష్మి వివాహం చేసుకుంది. ఈ దంపతులు సరోగసి ద్వారా ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.ఇకపోతే ఎప్పటికప్పుడు తన కూతురికి సంబంధించిన ఫోటోలను కూడా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.. ఇకపోతే ఈమె కెరియర్ విషయానికి వస్తే.. ఇటీవల మలయాళంలో మాన్స్టర్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇందులో మోహన్ లాల్ కీలకపాత్ర పోషించారు. మరొకవైపు బుల్లితెర టీవీ షో లతో హోస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది మంచు లక్ష్మీ.