ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన `పుష్ప ది రైజ్` 2021 డిసెంబర్ 17న విడుదలై ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో తెలిసిందే. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా `పుష్ప 2` రాబోతోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది.
మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ మెయిన్ విలన్ గా కనిపించబోతున్నాడు. ఇటీవలె ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లింది. ప్రస్తుతం బన్నీపై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాయి. రెండో భాగం మీద ఉన్న అంచనాల దృష్ట్యా సుకుమార్ స్క్రిప్ట్ లో ఎన్నో మార్పులు చేశాడు. ఏ విషయంలోనూ వెనక్కి తగ్గకుండా `పుష్ప 2`ను రూపొందించారు. ఈ ఏడాది డిసెంబర్ 17 ఈ చిత్రం విడుదల ఉంటుందని అభిమానులు అనుకున్నా.. పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ తదితర పనులన్నీ ఎక్కువగా ఉండటం వల్ల 2023 రిలీజ్ మీద దాదాపుగా ఆశలు వదులుకున్నారు.
వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ అవుతుందని భావించారు. కానీ, బన్నీ సుకుమార్ కు డెడ్ లైన్ పెట్టాడట. ఎట్టిపరిస్థితుల్లోనూ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 17నే విడుదల కావాలని చెప్పారట. అందుకోసం తాను ఎంత కష్టపడ్డానికైనా, ఏం చేయడానికైనా రెడీ అని బన్నీ చెప్పాడట. దీంతో సుక్కు కూడా దెబ్బకు ఫ్లాన్స్ అన్నీ ఛేంజ్ చేసి పరుగులు పెడుతున్నాడట. రెస్ట్ అన్నదే లేకుండా వేగంగానే షూటింగ్ లాగిస్తున్నాడట. మరో నాలుగు నెలల్లో షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసి.. మిగిలిన పనులపై దృష్టి సారించాలని సుకుమార్ భావిస్తున్నాడని టాక్ నడుస్తోంది.